పుట:పంచతంత్రి (భానుకవి).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[పోత] మని చెప్పవినమె సంజాతభీతి
యహితుఁడైనను రక్షింప నర్హుఁ డధిప!

76


క.

మును...........
...... ........................ డాతని కృప పెం
పునఁ గాచె ననఁగ వినమే
ఘనునకు ధా. ... జయమ్ము కరణిక లక్ష్మా!

77


గీ.

చెనఁటియైనను బ్రియ మొప్పఁ జేసెనేని
నతఁడు దనకెంతయును హిత వాచరించు,
మున్ను మృదువాక్యమునఁ గాదె! మ్రుచ్చు, దిగిచి
కొనినవిత్తమ్ము తద్గృహస్థునకు నొసఁగె.

78


వ.

అదెట్లని ఘూకప్రభుం డడిగిన నతం డిట్లనియె. ము న్నొకపురమ్మున
సార్ధవాహుండను వృద్ధవణిక్కు గలం డతనిభార్య నవయౌవనాంగి కల
దా, జంత యెన్నండును బతిని గైకొనక .............పరిరంభణమ్మునకుం జొరక
యుండునంత నొక్కనాఁడు,—

79


క.

చోరుఁ డొకఁడు సురంగ
ద్వారమ్మున నిల్లు సొచ్చి వచ్చుట గని, త
న్నారి భయమంది యప్పుడు
గారవ మొప్పార విభునిఁ గౌఁగిఁటఁ జేర్చెన్.

80


వ.

అప్పుడు సార్ధవాహుండును బరితుష్టుండై గృహముననున్న
చోరుం గనుంగొని యిట్లనియె.

81


క.

కలనైనఁ గౌఁగిలింపని
కలకంఠినిఁ గూర్చితివి సుఖం బొప్ప ననుం,
దలఁప నినుబోలు చుట్టము
గలఁడే! విత్తమ్ము నీవు గైకొను మనినన్.

82


వ.

చోరుండును గరుణాపరుండై నీకు సుఖమ్ము సిద్ధించినంజాలు, నా
చేత నపహరింపఁబడిన విత్తమ్మెల్ల నీవే కైకొనమని యతని కొసంగి యతని
సాధ్వికి పతి నెఱింగి సేవ జేసుక బ్రతుకుమని బుద్ధి చెప్పి యతికుతూహలమునఁ