పుట:పంచతంత్రి (భానుకవి).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నతఁడు నీ వెవ్వండ వని పల్క, నే చిరం
                    జీవి నన్నను గృపచేత నిట్టి
దశ నిన్ను బొందగతం బేమి మేఘవ
                    .............................ననిన
విని యిట్టి.........కిని నేను కొన్ని బు
                    ద్ధులు చెప్ప.... ..ములుగుచుండ


గీ.

నిన్ను సేవించి మనుమన్న, [న]న్ను నిన్ను
గూడెనంచు, విరూపిగాఁ [గొంచె]పఱచె.
నాకు [దొర వీవ యని పల్కి] జోకపుట్ట
నుండె కైతవ మేర్పడకుండనట్లు.

71


వ.

అని యిట్ల ................ కాకిమాటలు విని, ఘూకప్రభుండు తన
ప్రధానవర్గమ్ము పిలిపించి, యందు రక్తాక్షుం డనువానిం జూచి పగతుండైన
మేఘవర్ణుభృత్యుండు మనల నాశ్రయింపవచ్చినవాడు. ఏమి సేయవలయు ననిన,
వాఁ డిట్లనియె,—

72


మ.

పగవానిన్ మది విశ్వసింపఁజన దాప్తప్రక్రియన్ భర్తృకా
ర్యగుఁడై లోనరయంగ వచ్చెఁ గపటవ్యాపారపారంగతుం
దెగ జూడందగు; బ్రోవ నేమిటికి వీనిం ద్రుంచి నిష్కంటకం
బుగ రాజ్యం బొనరింపు మీవు కులమున్ బోషింపు మత్యున్నతిన్.

73


గీ.

పొసఁగ రోగమ్ము వైరమ్ము పుట్టినపుడు
నణఁపకున్నను బేలగు నతఁడు ధాత్రి,
కాలగతులను నవియ దుష్కరము లగుచుఁ
దనకు నాపద గూర్చు, నిట్లను చుఁ బలుక,—

74


క.

[విని] విమతుఁ డపుడు క్రూరా
క్షునిఁ జెప్పుమటన్న [వైరి] సొంపరి శరణం
బన, [ఁజంప నొప్పదనుచున్]
వినిపించె నతండు ధర్మనిరతుం డగుచున్.

75


గీ.

అతఁడు దీప్తాక్షు నడిగిన నతఁడు మృగయు
...మముచేత నాహారమయ్యె నాక