పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నీకతనఁ దనకు వాటిలె, నీకాఱియ యనుచుఁ జిత్త మెరియంగా శో
కాకులమతిఁ బతి దూఱిన, నాకంఠక్రోధవివశమై ఖగ మనియెన్.

624


ఉ.

ఇంతదురంతచింత దగునే నను నెవ్వనిఁగాఁ దలంచితో
యింతి మదీయశక్తి యసుదేవసుదేవదురాసదంబు నేఁ
డింతకుఁ జొచ్చి వారినిధి యేపున మృచ్చిలిగొన్నగ్రుడ్ల గ్ర
క్కింతు భవద్ఘనార్తిఁ దొలగింతు ధరింతు యశఃపరిష్క్రియన్.

625


చ.

అని నిజదార నూఱడిలునట్లుగఁ బల్కి వయోవయోమణు
ల్దనుఁ గనుగల్గి కొల్వఁ జని తత్పతగాగ్రణి గాంచె ముందఱన్
ఘనబలఘాతిహేతిభయకంపసమాగతమేనకాసుతా
వనకరణప్రహృష్టహిమపన్నగముద్రుఁ బయస్సముద్రునిన్.

626


వ.

కని తత్పారావారతీరంబున.

627


సీ.

తనతల్లి కెగ్గొనర్చినపాప రామాత కడుపునఁ గడిఁది చిచ్చిడినవాని
గజకచ్ఛపాహృతిగ్రాసచక్వణతృప్తి వెలుఁగొందు జాఠరానలమువాని
ముఖసరిద్విటమధ్యమున నసాధు నిషాదఘోరవాహిని నుంచుకొన్నవాని
లావుపెంపువఁ గులగ్రావపక్షచ్ఛేదినిశితాసివేఁడి మానిచినవాని


గీ.

నెల్లజగములు దనలోన నిముడుకొనిన, నిశిచరారంభసంభోధినిజశిరోధి
దివ్యమణిబోలెఁ దాల్చి నర్తించువానిఁ, బరమకారుణపూర్ణు సుపర్లుఁ గనియె.

628


క.

కని మ్రొక్కి నిలువ వినతా, వనితాసమ్మదవిధాయి వచ్చినకార్యం
బనుచరముఖ్యా నాతో, ననురాగం బొప్పఁ జెప్పుమా నా కనుడున్.

629


మ.

పలికెం డిట్టిభ మోవిహంగకులదీపా కోప మేపార న
జ్జలధిగ్రామణి నీభటుండనని నిచ్చ ల్నే బ్రశంసింపఁ గా
సిలుగు ల్సేసి గణింప కేడ్తెఱ హరించె న్మత్ప్రియాండంబు ల
గ్గలమే దేవర కన్నసాగర మెఱుంగంజెప్పుఁ డాలావునన్.

630


క.

కాకున్న నింతగర్వం, బాకడలికి నెట్లు కలుగు నని టిట్టిభ ము
త్సేకత వినిపించిన రో, షాకులితస్వాంతుఁడై ఖగాధిపుఁ డనియెన్.

631


క.

ఏమేమీ నాసుభట, గ్రామణినని నీవు పల్కఁగాఁ డిట్టిభశం
కామగ్నుఁడు గా కబ్ది, స్వామి మహాహమిక నిట్టివాఁ డయ్యెగదా.

632


ఉ.

ధీరగరుత్సమీరణహతి న్సలిలంబులఁ జల్లి దృష్టదు
ష్టోరగకోటిజీవితము లూడ్చి తిమింగిలతద్గిలాదివా
శ్చారములం ఘనజ్జఠరజజ్వలనార్చుల వ్రేల్చి వార్ధి ని
స్సారముఁ జేసి గ్రమ్మఱ నొసంగదుఁ ద్వద్వనితాండపిండముల్.

633