పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున కొసఁగెఁ గథనకామిష, మునఁ దృప్తింబొంది కాకముఖులకు నొసఁగెన్.

529


వ.

ఇట్టి మాయావు లున్నచోట సత్యంబు మూలఁబడి కల్ల వెల్లివిరియుఁ బింగళకుం
డును మదోత్కటంబువడువునఁ గుమంత్రి మంత్రయంత్రంబునం దగులువాఁడు
గాఁడె యన విని దమనకుండు క్షుద్రపరివారుం డగుట భూరమణున కొప్పుఁజే
యదొకో చెప్పుమన సంజీవకుం డతని కిట్లనియె.

530


చ.

అమరుమరాళసంవలితమై సితగృధ్రము హంసమట్ల హం
సము పరుషశ్మశానఖగసంవృతమై కనుపట్టు గృధ్రమ
ట్లమలమతు ల్దురాత్ము విమలాత్మునిఁ జేయుదు రల్పు లుత్తముం
దమవలె నుండఁజేయుదురు తద్ద్వయి నెయ్యది మేలు చెప్పుమా.

531


క.

కీ డెఱుఁగరు మే లెఱుఁగరు, చాడికి జెవి జేర్తు రుఱక జనలోకవిభుల్
పాడియుఁ బంతము గలచో, టేడ దొరకుఁ గొలువ నిలువ నెవ్వారలకున్.

532


క.

న్యాయం బన్యాయం బని, కూయిడి చెవి నిల్లు గట్టుకొని చెప్పంగా
నేయోజ న్వినకుండున్, మాయావులమాట లెట్టిమహిపతియైనన్.

533


క.

ఏకరణి వికలితాత్ముఁడు, గాకుండుం బతి పరోపఘాతనకరణా
స్తోకన్యాయామార్ద్రకి, ణీకృతముఖదుర్జనావినీతులచేతన్.

534


వ.

అవశ్యంబు రాజులు చెవి పేదలని పలికి వెండియు సంజీవకుండు.

535


క.

కులిశమును రాజుతేజముఁ, దలపోయ మహాకురాసదములచలములం
గులిశము వడు నృపుతేజము, పలుకులు వేయేల తునియఁబడు నెల్లెడలన్.

536


ఉ.

కావున రాజు నాదెస నకారణవైరముఁ బూని ద్రోహచిం
తావశుఁ డయ్యెఁ జాలు నిఁకఁ దద్భజనంబు మహాపరాక్రమ
శ్రీ విలసిల్ల గయ్య మొనరించెద గెల్చెద గెల్పు దక్కినం
జా వమరు న్దిగంతపరిషత్ప్రథ చేకుఱు శంక యేటికిన్.

537


చ.

సవనము లాచరించి కనుశక్రనికేతము భూరిదానధ
ర్మవిధు లొనర్చి కాంచుసురమందిర ముగ్రతపస్సమాధులం
దవులు మరుత్పథం బతులితత్వర శూరుఁడు గాంచుఁ బ్రాణముల్
ఠవఠవ లేక నిల్చి జగడంబున నేడ్తెఱ నూడ్చి పుచ్చినన్.

538


క.

గెలిచిన సిరి దొరుకు ననిం, బొలిసిన రంభాదియువతిభోగము దొరుకున్
దలగడ యది గద మృత్యువు, కలనికిఁ జావునకు నేల కళవళ మందన్.

539


చ.

బలము యశంబుఁ బ్రాభవముఁ బ్రాణము రాజ్యము మూలవిత్తమున్
గలన నరక్షణీయములు గావె మహామహులైనవారికిన్