పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పవలును గొల్చు టేయిడుమపాటునకా యిటులౌ నెఱుంగ నె
ట్టవునిఁక సత్యమౌ నెచటికైనను బోయెద నేను వీరలున్.

516


క.

అనఁజనదు తగులుతగులని, తనువుం బ్రాణంబుకంటెఁ దగులెద్దియొకో
చను తనువు విడిచి ప్రాణము, చనఁబోలనివారు గలరె సమయంబైనన్.

517


క.

పాటించి విడువ ముడువ, న్నీటబ్బకయున్నఁ బోవ నీకయ్యమునన్
బోటరిమగలకు శాటికి, గూటికి సీదిరమె రాచకొలు వేమిటికిన్.

518


క.

నుడువులన బయలుపందిలి, యిడి హస్తము బలుసుముంటేకెనయై దినముల్
గడపుచుఁ బొమ్మను నయ్యా, గడపునృపుం బాయుఁ జేగగలసైన్యంబుల్.

519


క.

తనకొఱకుఁ గఱఱకురిపులం, గని యని ముదలించి పొలియుఁ గన నశ్రద్ధం
గనుఁగొనక మనుజపతికిం, దనమేనిం బోలెఁ బ్రోవఁదగు భటపఙ్క్తిన్.

520


క.

నీ కెవ్వరు నేఁటికిఁ గ, ట్టాకడపట నుష్ట్రమొక్కఁ డసహాయముగా
భీకరపరిపంథిజయో, త్సేకివి గ మ్మని విషాదశిఖిలో మండన్.

521


వ.

కాకవ్యాఘ్రగోమాయువులు స్థలాంతరంబున కరుగ నుద్యోగించిన.

522


క.

బలహానికిఁ జిత్తమునం, గలఁగంబడి మాటపట్టు గలరాజయ్యుం
దల వంచి యుండెఁ గేసరి, ఖలుల కసాధ్యములు లేవు గద లోకమునన్.

523


వ.

అటు లబ్ధావకాశంబై కాకవ్యాఘ్రగోమాయువులతో నేకాంతంబు చేసి కథనకుం
బిలుచుకొని లోపలి కరిగి నిలుపంబడియె నందు వ్యాఘ్రంబు మ్రొక్కి నిలువం
బడి కేసరి కిట్లనియె.

524


మ.

సటలంకించుట యెప్పు డత్యవనతాస్యం బెత్తి నా నాహరి
త్కటకంబు ల్పరికించు టెప్పుడు దృఢస్కంధంబునం బొందుగా
దిట మానాసముఁ జేయు టెప్పు డకటా దేహంబు సామయ్యె నాఁ
కటి కడ్డంబుగ నారగింపు మివె కాకవ్యాఘ్రగోమాయువుల్.

525


క.

ఏవెంటఁ గడమపఱుపక, దేవా మము సంతరించితివి నీపాలం
జావగుట దమకుఁ దగు నటు, గావున భక్షింపు వనరఁగా నేమిటికిన్.

526


క.

అని పలికి తొలఁగె బెబ్బులి, చనవున పంచకము వాయసము దొడ్తోన
ట్లన పలికె నపుడు కథనకుఁ, డనఘుం డప్పదరు లారయక తా ననియెన్.

527


క.

మృగవల్లభ యాఁకటిచే, సగమైతివి నీకుఁ గైవసముగా నన్నుం
దగదె కనుంగొన నీపా, లగుఁ గథనకుఁ డారగింపుమా చేసేఁతన్.

528


క.

అనువచనము లోవెలిగాఁ, బెనురొదతోఁ గఱిచి వ్రచ్చె బెబ్బులి సింహ