పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గల దొకచిత్ర మాజి యుడుగ న్మృతి నిక్కువ మాహవార్థియై
మలసినచోట మృత్యు వనుమానము మాటలు వేయు నేటికిన్.

540


క.

పింగళకునితో మాఱ్కొని, సంగర మొనరింతు నొంతుఁ జంపుదుఁ జత్తున్
భంగమున కోర్వననునం, తం గటకట మిడికి పలికె దమనకుఁ డతనిన్.

541


క.

విమతునిబల మరయక వై, రముఁ గొనుజనుఁ డేర్పడం బరాభవ మందున్
సమధికబల మగుటిట్టిభ, కముతోఁ బగఁబూని చెడినకంధియపోలెన్.

542


క.

నావిని దమనకునకు సం, జీవకుఁ డిట్లనియె నీతిశీలా యేలా
గీవిధముఁ దేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

543


చ.

త్రిభువనకీర్తితాంబునిధితీరమున న్మును గల్గియుండుఁ డి
ట్టిభమిథునంబు దైవగతిఁ డిట్టిభి దౌహృదలాలసాంగియై
శుభమతి ప్రాణవల్లభునిఁ జూచి ప్రసూతికి వేళయయ్యె ధీ
విభవ యెఱుంగఁజెప్పఁగదవే స్థల మెయ్యది నాకు నావుడున్.

544


క.

టిట్టిభ మిట్లను నీకుం, గట్టనినీడములు గావె కంధితటంబుల్
పట్టయినచోట గ్రుడ్లం, బెట్టుము నీ వనినఁ డిట్టిభిక కనలెసఁగన్.

545


క.

మగనిఁ గని పలికె నేలా, తగుఁ తగదన కిటు పలికెదవు వనధితటి
జగతిని గట్టనిగూఁ డె, ట్లగు నీ కిది యంతకొంచెమా కనుఁగొనగన్.

546


ఉ.

పిట్టవు నీవు వారినిధి పెద్దల కెల్లను బెద్ద వెల్లి గాఁ
దొట్టు నొకానొకప్పు డతిదూరము తుంగతరంగసంఘముల్
బెట్టడఁచున్ హరించు నతిభీమభుజంగములీల నెట్టుగాఁ
బెట్టుదు నూతికట్టఁ బసిబిడ్డలు గావె మదండపిండముల్.

547


క.

కానకకాంచిన యీసం, తానము మనవలయు వార్ధిదరియేటకి నె
చ్చోనైన నిపుడ యొండొక, తానక మెఱిఁగింపు పెట్టెదం గ్రు డ్లచటన్.

548


క.

నావిని యెఱచెలువు కనుం, గ్రేవలఁ గేవలము తేరఁ గెరలి కఠోరా
రావమునఁ దనయనుంగుం, బావని నీక్షించి టిట్టిభం బిట్లనియెన్.

549


ఉ.

ఎక్కినవానికిం గుఱుచ యేనుఁగు నీ కసదైన నైతిఁగా
కెక్కువగానె న న్నెఱుగు నీసరిదీశుఁడు నాకు వార్ధికిన్
దిక్కరి మక్షికాంతరము దెల్పఁగ నేటికి గ్రుడ్లఁ బెట్టు మే
దిక్కుననైన వానిదెసఁ దేఱి కనుంగొనఁదీఱ దేరికిన్.

550


వ.

అనువచనంబు లాకర్ణింపంగూడక ప్రాణేశ్వరి ప్రాణేశ్వరున కిట్లనియె.

551