పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ట్లేనును గాడ్పాటునఁ జనఁ, గా నొకచో నుపరిభరము కంపలఁ దవిలెన్.

482


క.

తూరుపు తెలతెలనై రా, గా రువ్వున విసరునీఁదగాడ్పులు నయ్యా
సారమును ముట్టుకొనె నేమైరో నే నెఱుఁగ నిచట నాఁగితిఁ బదముల్.

483


వ.

నాపే రుష్ట్రంబు.

484


క.

అని తనకథ నెఱిగించిన, విని వాయసముఖులు గారవించి సుహృత్త్వం
బనఘా పాయక మాతో, నొనరింపుము నెమ్మిఁ గలసియుండుద మనుచున్.

485


వ.

ప్రత్యయపూర్వకంబుగా నతని నాదరించి కథనకుండనునామం బిడి తెచ్చి మదో
త్కటంబుం గానుపించి యభయదానంబుఁ బెంపుసేయించినఁ గాకవ్యాఘ్రగో
మాయువులం గలసి కొంతకాలంబు ప్రవర్తించె.

486


చ.

అటఁ జటులప్రతాపభయదాశువిశంకట మమ్మహామదో
త్కటము విదాహమోహకటకశ్రమశోకపురోగరోగసం
కటమున డస్సి వేఁట లరుగం దిరుగ న్వరగంధసింధుర
చ్ఛటనము నొంప వంప వడి చాలక నేలకు వ్రాలియుండఁగన్.

487


క.

చరణముల వ్రాలెఁ బులి య, క్కఱ డగ్గరి మ్రొక్కె వంచకము ప్రణమిల్లెన్
గరటము భద్రమె శుభమే, పరిణామమె యనుచు వినయపాటన మమరన్.

488


క.

నతిఁ జేసి నిలిచి దంతి, ప్రతిక్షణీకుక్షిదావపావకుఁ డేర్చెన్
గతి చెపుమా యాహార, స్థితి కీవని ఱంతు సేయ సింహం బనియెన్.

489


చ.

శితనఖరాంకుశాగ్రములచేఁ బ్రతివాసరము న్మదావళ
క్షితిపుల వ్రచ్చి మజ్జము భుజింతు మదంచితభుక్తశేష మా
శ్రితులకుఁ బెట్టుదుం దగభుజింతురు మీరు శరీరపాటవం
బతిశయితంబుకాదు గమనాగమనంబుల కేమి సేయుదున్.

490


క.

వ్యవహారయోగ్యములు గా, వవయవములు గలుగు టెట్టు లాహారము మీ
రవహితమతులయి కతిపయ, దివసంబులు ప్రోచికొనుఁడు దేహత్రయమున్.

491


క.

తనువునకు నుసుఱు వచ్చిన, దనుకం దనకామిషం బుదాత్తప్రీతిం
గొనితెండు పొండు మీ రన, ఘనతృష్ణం గాకజంబుకవ్యాఘ్రంబుల్.

492


ఉ.

తీరక పోయిపోయి బలుదెంపలఁ గంపల నేళ్ళ బీళ్ళఁ బ్రాఁ
బూరుల దారులం గడిదిపుట్టలఁ దిట్టల బోళ్ళ రాళ్ళ నీ
వారకరీరము ల్గలుగు వ్రంతలఁ గ్రంతలఁ జెట్ల గట్ల నా
హారమతిం జరించి జఠరానల మాఱక వచ్చి క్రమ్మఱన్.

493