పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కుత్సితరాజసంశ్రితుండ నగుట నే నాశశంబునకుం దోడువోయినవాఁడ మృత్యు
ముఖప్రవిష్టులకు బ్రతుకులేదు.

471


క.

పలువురుక్షుద్రులు మాయా, వులు పామరవసుమతీధవునికడ నున్నం
బొలియింతు రుత్తములఁ గే, వల ముష్ట్రముఁ జంపి మెసవవా కాకాదుల్.

472


క.

నావిని దమనకుఁ డలసం, జీవకు నిక్షించి నీతిశీలా యేలా
గీవిధము తేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

473


చ.

విటపసమృద్ధిఁ బత్రములవ్రేఁగునఁ బందిలిగొన్న కానుగుం
దుటుములు గట్టి యెండపొడ దూఱక ఘోరకఠోరజంతుప
ర్యటనదురాప మొక్కభయదాటవి రాజిలు నచ్చట న్మదో
త్కట మనుసింహ మప్రతిమగర్వధురంధర మొప్పు దానికిన్.

474


క.

పులియును నక్కయుఁ గాకియు, నలయక పరిచర్య సేయు నవి యొకనాఁ డ
ప్పొలమునఁ దిరుగుచు నొకచో, ములుగంపలు మెసవునుష్ట్రము న్గని తమలోన్.

475


క.

ఎక్కడిమొగ మెక్కడిపొడ, వెక్కడిరూ పేడగమన మెక్కడికంఠం
బెక్కడ వినము కనుంగొన, మిక్కొంకరమెకము ననుచు నేడ్తెఱ దానిన్.

476


క.

బలిభుక్ఫేరువ్యాఘ్రం, బులు డాయంబోయి పలికె మున్నెన్నఁడు నీ
పొలమున మెలఁగవు చెపుమా, తెలియఁగ నెందుండి నవచ్చితివి మృగముఖ్యా.

477


క.

కాననసత్వంబులలోఁ, గానము నీవంటిరూపు కడువెఱఁ గయ్యెన్
మానిబిడాద్భుత మఱఁ జెపు, మా నీవిధ మనిన నది యమర నిట్లనియెన్.

478


చ.

నను విను చోళమండలమున న్వసుమంతుఁడునాఁ బ్రసిద్ధిఁ గాం
చినయొకసెట్టి యుండు నలసెట్టెన మారునిలాఁతి కేగుచుం
దనధనరాశి పైనిడినఁ దాల్చి హుటాహుటి నేను భానుమం
తుని కిరణాంకురంబులును దూఱనియొండొకకానఁ బోవఁగన్.

479


మ.

సుషిరాస్యస్థలజాతఝాంకరణకక్షుణ్ణాశ మభ్రోచ్చల
ద్దృషదాస్ఫోటనపాతిభంబుకురజోతిగ్రస్తకూలంకషా
విష మున్మూలితరూఢమూలవివిధోర్వీజంబు బాహ్యాకిర
జ్ఝషకస్థానజలంబు వీచె నొకజంఝామారుతం బుద్ధతిన్.

480


క.

పినపినమెఱుపులు పొటిపొటి, చినుకులు మనసమసక లెసఁగు చీఁకట్లుం దో
చిన నొకరినొకరు గానక, చని రాలోఁ బసియుఁ గన్నచాయలఁ బఱచెన్.

481


క.

ఆనిశిఁ బసియును నొండొక, మానిసియుం బడఁడు దృష్టిమార్గంబున క