పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ష్ణాధృతి నానుకొన్న మనుజప్రసరం బనుజీవితేచ్ఛ నచ్ఛా
ధముడైన భూవిభుని నంటుఁ దదాగతబాధఁ గానమిన్.

460


చ.

సరసులతోడి నెయ్యములు జాఱ మదాళికఠోరదుర్గమ
ద్విరదశిరస్స్ఫురత్కటకదేశముల న్వసియించి తచ్చల
త్పరుషతరశ్రవోనిహతి భగ్ననిజాంగకమై పొరింబొరిం
ధరఁ బడి తేఱి నెమ్మనమునం దలఁచు న్బిసినీవిహారముల్.

461


వ.

నాకథ యట్టిద.

462


క.

కడుఁగఠినుం డగుభూపతి, కడఁజేరిన నిలువనీడ గలదా చెడదా
పుడమి నొకశశము వేసవి, యెడ దాపనిరాతి నాశ్రయించిన కతనన్.

463


క.

నావిని దమనకుఁ డలసం, జీవకు నీక్షించి నీతిశీలా యేలా
గీవిధముఁ దేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

464


చ.

మడువుల నున్ననీ రివుర మందవిహారము మానె వాయువు
ల్పడమర సాగఁ బర్వతములం దవము ల్దలలెత్తె నెండలం
బడుకలు వ్రస్సెఁ గూలె మృగపంక్తికిఁ బాంథులకు న్ధరిత్రిపై
నడుగిడఁ బ్రాణసంకటము నైన యొకానొకమండువేసవిన్.

465


క.

వనయవసవిరహితంబగు జనసంచారంబు బారి వారనిజాలిం
దను వెరియం దీవ్రచరుం, డనుశశరా జొక్కనాఁ డుదాత్తత్వరతోన్.

466


చ.

నిలువక వచ్చివచ్చి ధరణిం జిఱుపెంచికలు న్వసుంధరం
గలసినగోడలుం జివికి గంపలఁ గాచిన వెఱ్ఱిసొఱ్ఱతీ
వలు చిగిరెంత గంటగమివాతులు గప్పిన పూడుపాఁతఱ
ల్గలయొకయూరిపాడు పొడకట్టినఁ జేరఁగఁ బోయి యక్కడన్.

467


క.

నేలంగలసిన యొకదే, వాలయనికటమున నారయం బొడవై హిం
తాలము గతి మెఱయుశిల, న్బోలఁగ నలశశకులాధిపుఁడు గని వేడ్కన్.

468


వ.

చేరువం బోవ దూరంబుగాఁ బరపంజుకొని యున్నతచ్ఛాయం గాల్కొనంగోరి
తదగ్రంబున నిల్చియుండెఁ బ్రొద్దునుం బెరుగుచుండ నీడయుం దఱుగుచు వచ్చె
నట్లు మధ్యాహ్నంబునకు ఛాయానుసారియై మూలంబునకు వచ్చి.

469


చ.

అనలమువంటి యెండ నొడ లారట మందఁగ నాత్మలోన ని
ట్లని తలఁచె న్శశం బతులితాకృతిసంపదఁ జూచి దీనిడాఁ
పున వసియించి యిట్లయితిఁ బ్రొద్దొకచాయ వసించె బండఁజే
రిన దురవస్థలం బొరయరే జనులం చది వోయె నెవ్వగన్.

470