పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

లలితపటీరపాదపములం జిలువ ల్గమలోజ్వలజ్జల
స్థలముల గ్రాహము ల్గుణులచక్కిఁ బడ ప్రతికూలదుర్జనుల్
పొలుచు నిధానజాతముల భూతములుం గమనీయమాక్షికా
వళి సరఘ ల్సుఖంబులకు వారనివిఘ్నము లేర్పడుంగదా.

451


క.

కేతకు లురుకంటకసం, ఘాతులు జంబాలజములు గంజాతంబుల్
నాఁతులు కుటిలస్వాంతలు, భాతుందిలమణులు దోషపటలావృతముల్.

452


క.

అను సంజీవకుపలుకులు విని దమనకుఁ డనియె నెట్లు విశ్వసనీయుం
డనవచ్చు మానసంబునఁ, గనులు న్వెలిఁ గనికరంబుగల నీరాజున్.

453


మ.

పురతఃప్రాంజలిసాశ్రుదృగ్జలజుఁ డుత్ఫుల్లాస్యుఁ డాశ్లేషణా
చరణారంభణకేళి సత్ప్రియకథాసంప్రశ్నదత్తాధికా
దరుఁ డున్మాయి బహిర్మహామదురు డంతర్గూఢహాలాహలుం
డరుదే దుర్జనుఁ డెంత శిక్షితుఁ డపూర్వాఖర్వనాట్యౌచితిన్.

454


క.

ఇతరోత్కర్షణమౌన, వ్రతుఁడు నిజశ్లాఘనప్రవక్త సుసాధు
ప్రతిపక్షిదుష్టరక్షా, రతుఁడు సుమీ కుజనుఁ డైనరా జూహింపన్.

455


సీ.

కరుణావిలాస మేగతిఁ గప్పిపుచ్చునో కోపంబు కన్నులఁ గురియుచుండు
సత్యభాషణము లెచ్చటఁ గట్టిపెట్టునో బోయబొంకులె నోరఁ బొదలుచుండు
నుపకారశరణ మె ట్లుపసంహరించునో పరిపీడహృదయంబుఁ బట్టకుండు
సౌదార్య మె ట్లదృశ్యముగా నొనర్పునో పరమలోభము బుద్దిఁ బాయకుండు


తే.

నీతి యేనూతఁ ద్రోయునో నెరయ శుద్ధ, ముష్కరత్వంబు సేఁతల మోసు లెత్తు
మేలు డిగఁ ద్రావి కీ డుద్గమింపఁజేయు, పాపకర్ముండు రాజైన బ్రదుకుగలదె.

456


చ.

అవనిపుఁ డెట్లు భాషితము లాడు శఠాధిపుఁ డెట్లు దృష్టిపా
టవము వహించు రా జెటు లోడంబడు కోరి విన న్వధూరతో
త్సవవిముఖుండు శంభువరదాననియుక్తుఁడు నోరఁగన్నులం
జెవులను బంచమేఢ్రుఁ డెడసేయక శిశ్నము లూఁదియుండుటన్.

457


చ.

తిమిరనివారణక్రియకు దీపము వారిధి విస్తరింపఁబో
తము చవిఁ బాపవహ్నిరవితాపభరం బడఁగింప నాతప
త్రము కలుషంబులం జెఱుప ధర్మము బాల్పడియుండుఁ గాని య
క్కమలజుఁడు న్సుఖోద్యముఁడు గాఁడు దురాత్ముని జక్కఁజేయఁగన్.

458


వ.

దమనకునకు సంజీవకుం డిట్లనియె.

459


ఉ.

సాధుమధుస్పృహందివససాతిగమంబు రుహాంతరాళసం
రోధము చంచరీకనికురుంబ మెఱుంగకపోవునట్లు తృ