పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఓరీ యాఁకటఁ గ్రుస్సితి న్సరగ రాకుండెట్లు త్రాసంబు లే
దో రామాదులఁ బాసి రా మనసు రాదో వచ్చుమార్గంబునం
దే రడ్డంబుగఁ బాఱెనో బలిమి యెందేనేమి చేకూఱెనో
యౌరా జా గొనరించి తీ వనిన బ్రజ్ఞాయత్తచిత్తంబునన్.

352


ఉ.

కేసరివంకఁ జూచి పలికెన్ శశ మే నపరాధిఁ గాఁ జుమీ
యాసరసీరుహాప్తుఁ డుదయంబగునప్పుడె లేచి యాఁకటం
గాసిలె వల్లభుండని తగం బఱతేరఁగ ద్రోవ నున్మిష
త్కేసరపఙ్క్తి దూల నొకకేసరినాథుఁ డహో యవారణన్.

353


చ.

సెలవులవెంట భూరిమదసింధురమజ్జము గాఱఁగా విశృం
ఖలగతి వచ్చె వచ్చి యరికట్టి యదల్చె సమీపవర్తియై
పలికె మృగాధమా బలముఁ బాపెద మత్సదృశద్విపాహితుం
బొలమునఁ గానవే కదిసి పో రొనరింపఁగ నింపువుట్టెడిన్.

354


క.

ననుఁబోల సింగములు లే, వని కేసరి పోతరమున నాడినమాట
ల్విని విని వారితభీతిన్, ఘనరీతి గజాభియాతిఁ గని యిట్లంటిన్.

355


క.

సంగరసంరంభపుటా, సంగర ముప్పొంగెనేని క్షణమాత్రము ని
ల్వంగలవేని తెచ్చెద, ముంగలికరిమథనచంగము న్సింగంబున్.

356


క.

అది నీకోరికఁ దీర్తుం, గదలకు మిచ్చోట ననుచు గాఢప్రజ్ఞా
భ్యుదయమునఁ జేసి చావక, బ్రదికి యహా నీకు విన్నపము సేయుటకున్.

357


క.

ఏతెంచితిఁ దడయుట కిది, హేతువు పంచాస్యమూర్తి వీ వగుటఁజుమీ
యోతీవ్రశౌర్యయారా, జాతతవిఖ్యాతనిరతుఁడై యొప్పెసఁగెన్.

358


క.

చేరి నినుఁ గొలువవలెనో, వారక యాహరినె కొలువవలెనో మాకె
వ్వారిందు రాజులనఁ గం, ఠీరవ మిట్లనియె నెవ్వడి న్మశమునకున్.

359


శా.

ఏమేమీ నిను నడ్డగించుకొనెనా యిట్లాడెనా నిక్కమౌ
నా మేలే సమరేచ్ఛయంతబలు పౌనా పౌదమా చూపలే
వా ము న్నెక్కడఁ గంటి వప్పరమగర్వగ్రంధి మచ్ఛాతదం
ష్ట్రామోఘాభిహతి న్వధింతుఁ దగ నాహారింతుఁ దన్మాంసమున్.

360


క.

నావిని శశకము నామా, యావాగురఁ జిక్కె సింహ మని యుబ్బుచు నో
దేవా విచ్చేయుము సం, ధావిభవం బెసఁగఁ జూపెదం బ్రతిపక్షిన్.

361


చ.

నిలువక వత్తుగా కని పని న్గొనిపోయి చలింప కారసా
తలజలపూర్ణకూప ముచితస్థితిఁ జూపి శశంబు వల్కె లో