పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పలఁ గనుపట్టు చూడు ప్రతిపక్షి ననం బరికించి తజ్జల
స్థలిఁ బెఱసింగముంబలె నిజప్రతిబింబము గోచరింపఁగన్.

362


క.

కడుఁ గెరలి యెగసి నూతం, బడనుఱికె మునింగి తేలెఁ బానీయంబు
ల్గడుపారఁ ద్రావె నసువు, ల్విడిచెం గరినైరి తీవ్రవేదనఁగృశమై.

363


వ.

బుద్ధిగలవానికి బలంబునుం గలదనుట కిది నిదర్శనం బనుటయుఁ గరటకుండు దమ
నకు నలరుమొగంబునం జూచి బుద్ధిమంతుండ వగుదు నీకు శుభంబయ్యెడు మిత్రభేదం
బున కుద్యోగింపుము పోయిరమ్మనిన నతండు కరటకు వీడ్కొని సంజీవకుండు లేని
వేళఁ బింగళకుసమీపంబున కరిగి ప్రణామం బాచరించి నిలిచిన మృగరా జమ్మంత్రి
తనయున కిట్లనియె.

364


క.

నీవలనఁ బ్రాజ్యరాజ్యముఁ, గావించెదఁగాదె దమనకా యేకార్యం
బీ వూఁది తెలుపవచ్చితి, వావిధ మెఱిఁగింపు మనిన నతఁ డిట్లనియెన్.

365


సీ.

చిరకాలసంశ్రేయస్థితి నమ్మదిరిగిన తనవారిదెస ననాదరము సేసి
సిరిఁ గోరి నడుమవచ్చినవారి మన్నింతు రభినవప్రియులు భూవిభులు గారె
పురుషుగుణాగుణంబులు విచారింపక నీతి యేపతికి మన్నింపఁ జెఱుపఁ
బరులనందఱఁ దమువలె నిరీక్షింతు రక్కఱటులు చనుత్రోవ లెఱుఁగలేరు


తే.

నమ్మఁగలవారు గాక దుర్ణయము పేర్మి , నెవ్వ రెటు సేయుదురొ యెట్టు లెఱుఁగవచ్చుఁ
గర్కటిక గాదుకద ముంటిగంటిఁ దెలియఁ, గాఁ బరస్వాంత మనినఁ బింగళకుఁ డతని.

366


చ.

కనుగొని పల్కె నోదమనకా మతి శంకితమయ్యె నిప్పు డి
ట్లనుటకు హేతు వెద్ది తెలియన్వలె సర్వముఁ జెప్పుమన్న నా
యనయను విన్నవింపవలెనా మృగనాయక నీతిఁ జెప్పఁగా
వినువినకుండు నాకుఁ దగవే కలకార్యముఁ గప్పిపుచ్చఁగన్.

367


ఉ.

త్రోవకు శుద్ధసాధుచరితుండని చిత్తమునం దలంచి సం
జీవకుఁ దెచ్చి నీసఖునిఁ జేసితి నీవును వాని కూర్జిత
శ్రీవిభవం బొసంగి సవరించితి వందఱ మూలభృత్యులం
జీవితతుల్యులం జవుకఁజేసి కడంబడవయిచి తీ విటన్.

368


సీ.

సదృశభోగము సమాసనముఁ దుల్యవిభూతియును భృత్యునకు నీఁగి చనదు పతికి
నిన్నియు నతనికి నిచ్చితి సామ్రాజ్య మేమిపాపముఁ జేసె నిత్తుగాక
సంజీవికునితోడి సఖ్యంబు పైవచ్చె హెచ్చించి యాపదఁ దెచ్చుకొంటి
యొంటిపాటున నాతఁ డొకనాఁడు నాతోడ నోడక నీసుద్దు లుగ్గడించి


తే.

రహితశక్తిత్రయుఁడు మందరశ్మి మూఢుఁ, డితని కెక్కడిసామ్రాజ్య మేడ బ్రదుకు
చెడియెఁ దెకతేర యనుచుఁ కేరడములాడె, ననిన విని విన్ననయియుండె హరివరుండు.

369