ఇతనికవిత్వములో లక్షణవిరుద్ధములగు ప్రయోగము లున్నవనియు, నందుచేతనే లక్షణకర్త లుదాహరణముగా నీతనికృతిఁ గొనకపోయి రనియు నందురు. ఈలక్షణవిరుద్ధప్రయోగము లెల్లగ్రంథంబులయందును గన్పడుచున్నని కాని యవి కొందఱియదృష్టంబుఁ బట్టి సాధువులుగను గొందఱిదౌర్భాగ్యముంబట్టి యసాధువులుగను సాధింపఁబడుచున్నవి. ఇతఁ డీపంచతంత్రంబును సంస్కృతమునకు భాషాంతరీకరణమువలెఁ గాక ప్రబంధశైలిలో వ్రాసినాఁడు. కవిత్వ మెట్లుండవలయునో యీతఁడే యీ పంచతంత్రమున,
| "ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢము గాక ద్రావిడీ | |
అనుపద్యముచేఁ జెప్పి యున్నాఁడు. తిలకింపుఁడీ!
కావ్యంబున నొక్కొక్కఁ డొక్కయిక్క నరయుచుండును. 'భిన్నరుచి ర్హి లోకః' అనునట్లు లోకంబునఁ బలువురు పలువిధంబు లగు రుచులు గలిగియుందుకు. దీనినే యీ వేంకటనాథుఁడు,
సీ. | "ఒకఁ డలంకారంబునకు వేడుక వహించు నొకఁడు వార్తాసమృద్ధికిఁ జెలంగు | |
తే. | గామి చందానఁ దలవరి కరణి బధిరు, వలె దరిద్రునిగతి వాది పరిదిఁ గనక | |
అని చాటియున్నాఁడు. 'అవిదితగుణాపి సత్కవిభణితిః కర్ణేషు వమతి మధుధారామ్' అన్నట్లు చవిఁ గొనుఁ డీపద్యమునందలి మాధుర్యము!
ఎట్టివానికృతియందును దప్పులుండక పోవు. ఉండినంతనే వానికృతికిఁగాని యాతనికిఁ గాని కళంక మాపాదింపరాదు. గుణపరీక్షణము చేయవలయుఁ గదా? రసపుష్టిఁ గనుగొనవలయుఁ గదా? దీనినే యీతఁడు,
| "ఒప్పులు గలకృతిలో నొక, తప్పున్నను గడమ గాదు దానికిఁ గళలం | |
అని వక్కాణించె.