పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దును మోసపోవక రక్షించిన చిరకాలసంచితార్థంబు శిష్యునిచేతి కిచ్చి వచ్చితి
శంకాయత్తంబై చిత్తంబు తత్తరించుచున్నయది యేమి యగునొకో యనుచు
ననుష్ఠానంబునకుం బాసి యబ్బడుగుసన్యాసి నిప్పుల ద్రొక్కినక్రోఁతివడువున మడిమ
లూఁదక మఠంబునకు వచ్చి.

236


క.

తానకమున నిజశిష్యుం, గానక యాషాఢభూతిగా రారా తే
రా నాసొమ్మని చీరు, న్దీనత నోరెండ యతి యతివ్యథతోడన్.

237


చ.

వెలవెలనై మఠాలయము వెల్వడుఁ దాపనిషక్తకంఠుఁడై
కెలఁకులఁ జూచు భూమిసురగేహము లారయు నేఁడు భిక్షకై
తెలతెలవేగి శిష్యుఁ డరుదేఁడుగదా కనుఁగొన్నఁ జెప్పరే
కలుషవిదూరులార పనిగ ల్దను నుస్సను నూర్చు హాయనున్.

238


క.

తప్పెను కార్యం బను నిఁక, నెప్పుడు వీక్షింతు నను నిఁకెక్కడ నున్నాఁ
డెప్పుడు చేదొరికెం ధన, మప్పుడె కపటాత్ముఁ డరిగె నని తలయూఁచున్.

239


క.

అడిగినవారిం గ్రమ్మఱ, నడుగంజనుఁ జనిన కడకు నతఁ డార్తుండై
గుడిగుండ మనక పల్లియ, పడుసరనాకరయుఁ జెఱిచి పఱచినశిష్యున్.

240


క.

ఈగతి యతి వేసటలే, కాగడపుంబోక శిష్యు నారసి యచ్చో
నేగుఱుతును గానక యా, భోగతరశ్రాంతి నొక్కపురమున కరిగెన్.

241


ఉ.

స్నాన మొనర్ప దీమసము చాలక నోంకృతి నోరఁ బేర్కొనం
గానక భిక్షకుండు దిరుగం జరణంబులు రాక ద్రవ్యకం
థా నసుఁ బాసితే యనుదుఁ దాపభరంబున మేన్చలింప లో
లో నడలూన రేయుఁబగలు న్విలపించు నతండు దీనతన్.

242


ఉ.

గాసిలి పట్టఁగోల్పడిన గాలిపిశాచమువోలెఁ గష్టస
న్యాసి దురంతతాపమున నారటమందుచు నార్జితార్థకం
థాసృతివాడలం దిరుగుఁ దాంతదశం గృశియించి యిచ్చలో
వేసరి నిల్చె సంజకడ వేఱొకసాలియవానిలోఁగిటన్.

243


క.

నిలిచి యతి కొంతచింతం, బలవించుచుఁ బంచ తిన్నెపెైఁ బడి వలకే
ల్దలక్రిందం జేరిచికొని, వెలవెలనై నిద్ర లేక వేఁగుచునుండెన్.

244


వ.

అంత.

245


ఉ.

వెంగలిపోకఁ బానగృహవీథికి నెక్కఁటి నేఁతకాఁడు వో
వంగను జూచి దూతి పిలునం దలవాకిటిఁ బాసి పల్లవా
లింగనకాంక్షఁ దన్మహిళ లేఁగను మబ్బునఁ డక్కుఁబెట్టి తు