పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ్ఛాంగన రథ్య వేనేగ నెదురై పతిగన్నులు గోచరింపఁగన్.

246


చ.

కని యదలించి యోసి చెడుఁగా కడగాలము సేర నెక్కడం
జనియెదు భర్తకాఁపురము సైఁపదె కుక్కకు నాజ్య మిందు నే
మన మనసైన నిచ్చె నఁటిమార్గముఁ బట్టుదె కాచువాఁడుఁ గాఁ
డని నను నిచ్చలో నెఱుఁగవా తెగవా నగుబాలు సేయఁగన్.

247


క.

కెళవుల నీచెడుపోకలఁ, దెలియనె రేపగలు గాచి తిరుగనె చేయం
గలిగిన డాఁగునె యన నం, దుల కాజగఱాఁగ జాలిఁ దూలక పలికెన్.

248


ఉ.

ఓసరిపోయె ని ల్వెడలకుండ నయో నను రాణివాసిఁగాఁ
జేసితొ తొత్తులం బనులు సేయఁగనిచ్చినఁ బోలదంటినే
వాసికిఁ బోర నన్నుఁ గడవం బనిపాటలు సేయువార లే
రీ సురఁ ద్రావి మైమఱచి ప్రేలెదు కంటివొ పట్టుకొంటివో.

249


క.

కూరకు నారకు బయలికి, రారా దనుమేర గలదొ రానో పోనో
యౌరా చూడవె నేఁడే, లారోసము వచ్చెఁ గ్రొత్తలా యిత్తెఱఁగుల్.

250


క.

పలుకుల కేమీ రోసము, గలిగిన మగవాఁడనయినఁ గాచి కడంకం
దలతలఁ బట్టికొనంగా, వలదంటినొ చంపి త్రోని వలదంటినొకో.

251


క.

రుసింంటిదాన నన్నీ, కుసిగుం పొనరించి యేమి గుడిచెదు పాపం
బసివోలెఁ దాకు నిను నే, నుసురన్నం జాలుఁ జాలు నోహో యనుఁడున్.

252


ఉ.

కాలికుడ న్బతివ్రతవు గావె యయో నీను నీవ యెన్నుకో
నేల జగం బెఱుంగు మఱి యేను నెఱుంగుదు వింతవాఁడనే
చాలుఁ బురే పతివ్రతలు సంజకడం బెఱవాడఁబోక సం
శీలమ యిల్లు సేరు మెడసేయక యన్నియుఁ జక్క నయ్యెడున్.

253


వ.

అని రోషపరుషవచనంబులం గినియుచు గృహంబునకుం గొనిపోయి యయ్యవ
గాకి ఱంకుటాలిం గాలం గేలం బొడిచి పెడమఱలం దిగిచి నిట్రాత నేఁతపగ్గంబునం
బంధించి కాలికుండు నిద్రించె నంతఁ గొంతప్రొ ద్దరిగిన.

254


శా.

జారప్రేరితయై వినిర్భయమనీషం దూతి యేతెంచి చే
బారంబెట్టి కుటీరభారవహశుంభత్సంభృతస్తంభవి
స్ఫారప్రాంజులరజ్జుబంధితవయస్యం గాంచి కన్నీరుము
న్నీరై వెల్లివడంగఁ గాలికుని లో నిందింపుచుం గూరిమిన్.

255


క.

ఎదఁ జేర్చి కర్ణ మొయ్యనఁ, గదిసి ప్రయోజనముఁ జెఱిచెఁ గా చెలియా యీ
ముదకఁడు సరిప్రొద్దాయె, న్నిదురించిరి ప్రజలు వే చనిన మేల్గాదే.

256