పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్థితిజాగరూక మేయున్నతిఁ జెపుమా మనుజపశువునకుఁ బశువునకున్.

138


క.

కసవు దినుఁ గూడు దెమ్మని, కసరదు బరు విడిన మోయుఁ గర్శనమునకున్
విసువదు మారొడ్డాడదు, పసరమునకు సరియె మనుజపశు వెప్పటికిన్.

139


క.

అన విని కరటకుఁ డతని, న్గనుఁగొని యిట్లనియె దమనకా విభునకు గ
ల్గినదండనాథులము దగ, మన కీవ్యాపార మనభిమత ముడుగదగున్.

140


వ.

అనిన దమనకుండు.

141


క.

పరమస్వతంత్రులయి భూ, వరుసన్నిధి మంత్రు లుండవలె నమ్మంత్రుల్
పరతంత్రు లయినఁ గలవే, పురుషార్ధము గౌరవము బ్రభుత్వము యశమున్.

142


క.

గ్రావాగ్రమునకు భూరి, గ్రావం బెక్కింప భరము గా దది ధరకున్
ద్రోవఁ బ్రయాసమె యున్నతి, కైవలెబా టధమవృత్తి కది యేమిటికిన్.

143


క.

తనకున్ హృదయము వశమై, యనుచరుచందమున నుండు నది యేమియొకో
మనుజుఁడు గౌరవ మొల్లక, ఘనలాఘవదంశితుండుగా నీక్షించున్.

144


క.

అని చెప్పి మఱియు గరటకుఁ, గనుఁగొని దమనకుఁడు బలికెఁ గంటే పంచా
ననసార్వభౌమునకు నా, ననమొప్ప దిదేమికారణము నేఁ డనుచున్.

145


క.

అది విని కంటకుఁడు మదిం, గదిరిన యచ్చెరువున న్మొగము జూచి యహో
యిది నీ వేతెఱగున నెఱుఁ, గుదు వన నాయనకు దమనకుం డిట్లనియెన్.

146


మ.

మతి నే నిచ్చినఁ గాని లేదు చన దాత్మశ్లాఘనామానసం
బితరాకారవిచేష్టితార్థముల నూహించు న్ధరిత్రిం బశు
ప్రతతు ల్నేర్చు నుదీరితార్థముల దిక్ప్రఖ్యాతమేధాసమ
న్వితుఁడై వర్తిలు పండితుం డకట వానిం బోలఁడే చెప్పుమా.

147


క.

చతురుఁడుగనుఁ బతిచేష్టా, గతిఁ దెలిసితి ననిన నతఁడు కాఁగా నోస
మ్మతి గాదు నాకు సేవా, స్థితి నీ కెఱుకపడుఁ గుశలచిత్తములేమిన్.

148


వ.

అని కరటకుండు వలికిన దమనకుం డతని కిట్లనియె.

149


క.

భూషింప మెచ్చు లోకము, దూషింపం జంపఁజూచుఁ దుది నదె విద్వ
ద్భూషితుని నన్ను నేలా, దూషించితి వైన నేరుతుం బతిఁ గొల్వన్.

150


క.

నృపసంశ్రయమున నా కతి, నిపుణత యేవలన లేదు నీవ యనియెదో
యిపు డెవ్వరేని శత్రుం, తప యోరిమిలేక యనియెదరొ ననుఁ జెపుమా.

151


క.

అను దమనకునాననము, న్గనుఁగొని కరటకుఁడు పలికెఁ గాదా మును నీ
వనవసరంబునఁ జనవో, కినుక న్నిను విభుఁడు గోపగింపఁడొ నెరయన్.

152


సీ.

ఆఁకొని భుజియింప నరుగువేళ నొకింత యొడలికి నుపఘాత మొదవినపుడు