పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అరసాన్నగ్రహణాస్థిశేషనతదేహన్ సౌఖ్యకృత్తైలసం
స్కరణాభావజటీకృతాలకననీష ద్దైన్యతామ్యన్ముఖం
బరుషప్రాక్పరిధానసంసృతనితంబ న్నిర్గతాలంబనా
జరఠం గన్గొని యొండునాక నగరస్వాముల్ ప్రసాదించినన్.

45


క.

వనిత పనిఁబూని వానిన్, దనయునిగా బెనుచుకొనిన దక్సుకృతం బే
మని చెప్పవచ్చు విద్యా, ధనుఁడు గుణాకరుఁడు ధీరతరుఁ డితఁ డయ్యెన్.

46


క.

అతఁ డొకనాఁడు దారి, ద్ర్యాతురుఁడై ధాత వొలసి యలసి ముహీశ
య్యాతలమున నిదురించి య, హో తేజలాభమూల మొక్కటఁ గనియెన్.

47


ఉ.

చేరి తృతీయయామమున సెట్టి గలంగి సదుల్లసన్మరు
ద్భూరుహభంగిఁ గెంజడలు భూతివళక్షితమైన మేన నిం
డారగఁ గావికావు మసినంటినమోము సలక్ష్మశుభ్రరో
చీరుచి నేవగింప నొకసిద్ధుఁడు వచ్చి సదాదరాయతిన్.

48


చ.

అనియె నహా కిరాటతనయా వినయాదిగుణంబులందు నే
మనుజుఁడు నీకు సాటి యలమాట లటుండెఁ బ్రభాతమైన నీ
కనుఁగవకు న్ఘనక్షపణకత్రయము న్గనుపట్టు ముంగిటం
బనివడి దానిఁ జంపు మది భర్మనిధిత్రయమూర్తి నుండెడున్.

49


క.

ఆనిధులఁ బుచ్చుకొని ధని, వై నీతిఖ్యాతిరీతు లమరఁగ మనుమం
చానిత్యసత్యుఁ డరిగిన, మానస మలరం గిరాటమణి మేల్కనియెన్.

50


తే.

మేలుకని భక్తిఁ బ్రణమిల్లి మేననిలిచి, తల్లి యూరుజమహిళామతల్లి కనియె
నమ్మ యిమ్మందిరంబున నలికి మ్రుగ్గుఁ, బెట్టు మిపుడు శుభంబు లభించు మనకు.

51


క.

వలదు విలంబన మన న, ప్పలితగృహం బలికి పూసి పసపొసంగం గు
గ్గులు మృగ్గులు నిడి యక్కథ, నలఘుమతిం దెలిపె సనయుఁ డగుతనయునకున్.

52


క.

క్షౌరమునకు సమయంబగు, టారసి నాపితుఁడు వచ్చె నాలో దైవ
ప్రారంభమున నపూర్వవి, భారూఢక్షపణకత్రయంబును వచ్చెన్.

53


వ.

వచ్చిన.

54


క.

మే నుప్పొంగఁగఁ బెంజెర, కూన న్నగు లగుడ మెత్తికొని ప్రాణంబుల్
పోవడఁచె సెట్టి యాలో, దీనత్రితిమం బహో నిధిత్రయ మయ్యెన్.

55


వ.

అయిన.

56


క.

ఆనిధులఁ బుచ్చుకొని ధని, యై నాపితుఁ జూచి వణిజుఁ దాదృతి మెఱయన్
దీనారశతక మిడి మదిఁ, బూసినకౌతూహలమునఁ బొమ్మని పల్కెన్.

57


చ.

వెఱగు జనింప నత్తెఱఁగు వెంగలిమంగలి సూచి కన్నుమి
న్నెఱుఁగక యింటికే గి యటు లేనును భూరినిధు ల్గడింతు నం
చఱిముఱి గొంకులేక లగుడాగ్రముఁ గైకొని యత్న మేమియున్
గరిపడకుండ నాక్షపణకత్రితయాగమనంబుఁ గోరఁగన్.

58