పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్సరబుద్ధిం బలెఁ జించుమేఘముల దంతత్రోటికోటిం జలా
హరణారంభణజృంభణంబులు దదీయవ్యాళశుండాలముల్.

525


మ.

తనరస్ముల్కవిసంభవాండభువనధ్వాంతచ్ఛిదాచంచువు
ల్వినఁ జెప్ప న్వెఱఁ గీమహాతిమిరపాళి న్విచ్చిపోఁ దోలలే
వని రథ్యోత్థరజోదరస్తిమితదీక్షాభోగుఁడై హేళిగ
న్గొన నగ్ఘోరతరటరాటవి న్మనునెలుంగు ల్గుంపులై వేసవిన్.

526


శా.

పై పైఁ బ్రాణివధప్రధానగుణ మొప్పం గౌరగౌరద్యుతుల్
దీపింప న్విషమాంబకభ్రమిఁ బ్రభీతిం జేయ నత్యుత్కటా
టోపం బుగ్రగజాహృతివ్యసనకండూలంబుగా నుండుగుం
పై పంచాస్యము లయ్యరణ్యయినఁ బంచాస్యప్రకారంబునన్.

527


శా.

క్రందై వెల్వడు ఘుర్ఘురధ్వనిమృదంగస్థాయిగాఁ దాలుని
ష్యందస్థూలవిశాలలాలసవరంబై యొప్పుశృంగోద్ధతిం
జిందుల్ ద్రొక్కఁ గుడుంగరంగముల నిస్సీమత్వరాతిభ్రమిం
బందుల్ దిఙ్మృగయుచ్ఛిదాగుణపరిస్పందుల్ దదుగ్రాటవిన్.

528


క.

అలఘుతరవారిధారా, దళితప్రతికూలసకలధరణీభృత్సం
కులమై యొకసెలయే ఱ, ప్పొలమున జగదేకవీరుపోలిక నమరున్.

529


వ.

అది రామలక్ష్మణాలంకృతంబై పంచవటస్థానంబును సత్వసంపన్నంబై సమీర
ణంబును గజగవయవిహారయోగ్యంబై కిష్కింధానగరంబును నుపాసితపరమ
హంసంబై వేదాంతశాస్త్రంబును నఖండశబ్దక్రియానిరూపణంబై వ్యాకరణం
బును ప్రబోధితనిగమజాలంబై ధర్మంబును ఘనరసప్రధానంబై విద్వత్ప్ర
బంధంబు ననుకరించిన యమ్మహాప్రవాహంబున.

530


క.

నీతికళానిధిగలఁ డభి, జాతుం డనుకమఠవిభుఁడు సంతతపంక
స్థాతృత నొందియు నద్భుత, మాతం డేవంకఁ బంక మంటక తిరుగున్.

531


శా.

ఆతాఁబే లొకనాఁటిరేయి ధరణీవ్యాపారలిప్సాపరం
బై తానంబులఁ బాసి తీరశరతృణ్యావీథుల న్నిల్వ భూ
జాతచ్ఛాయలశీతలానిలకృతాంచద్వాలుకాలేఖికా
వ్రాతాభ్యగ్రముల న్విశృంఖలగతి న్వర్తించె వర్తింపఁగన్.

532


చ.

అఱిముఱి చిచ్చు నాఁ బొగులు నాఁకట బ్రుంగుడునంగుడై యొడల్
సుఱసుఱ స్రుక్క నయ్యడవిలో నొకనక్క తటస్ఫుటంబులన్
బొఱియలఁ దోఁకఁ జొన్పి వెలిభూమికిఁ దార్చిన యెండ్రితండముల్
గఱుకుచు వచ్చి వచ్చి యలకూర్మముఁ గాంచి ప్రహృష్టచిత్తమై.

533