పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్సరమునఁ బిల్వబంచెద విశాలకు నెమ్మదినుండు పోయి క్ర
మ్మఱియెద నంచుఁ బుత్రిఁ దగుమాటలఁ దేర్చి సగౌరవంబునన్.

386


వ.

వివిధాభరణంబులు చిత్రవస్త్రంబులు పరిమళప్రముఖంబు లగు సర్వవస్తువు లిచ్చి
బంధుజనులనియోగంబు నడపి చతురంతయానాధిరూఢ యగుచుఁ జతురంగసే
నాపరివృతుం డగుసుకీర్తుతోన మరలి పురంబున కరిగి సుఖం బుండె.

387


ఉ.

ఆజయసేనుఁ డంతఁ బరమాదరణంబున బ్రహ్మరాక్షసుం
బూజలఁ దన్పి కేల్మొగిచి పొండిఁక మీరన నుత్సహించి గో
త్రాజరదైత్యుఁ డానరవరాత్మజు మన్నన సేసిపోయె నం
భోజభవాలయంబునకుఁ బుష్పక మెక్కి సుర ల్భజింపఁగన్.

388


వ.

ఆరాత్రి మజ్జనభోజనాదికార్యంబు లాచరించి.

389


సీ.

చంద్రికపూవన్నెజిలుఁగుదువ్వలువమేల్కట్టు దంతపుఁగోళ్ళపట్టెమంచ
మొఱుగుబిల్లలు పట్టుపఱుపు కప్రపుఁబల్కుసురటి క్రొవ్విరులు కస్తూరిరాయి
పూపుగట్టినగందపొడికదంబముపెట్టె కలపంబుచికిలిబాగాలబరణి
పండుటాకులు నానవాల్పానకములును గండచక్కెర తెల్లపిండివంట


తే.

సంజసరిపట్టుబకదారిజాతిపారు, నములు గుజరాతికెంపుదీపములు బూతు
చిత్రపటములు కుడినీరుచెంబు గలిగి, తనరుసదనంబు రాజనందనుఁడు సొచ్చె.

390


సీ.

 మంచికప్రము మేళవించినపన్నీట సరసాళిజనము మజ్జనముఁ జేసి
జిలుగుమాంధాళి కుచ్చెలఁబోసి కట్టి దేహమునఁ గుంకుమరసం బప్పళించి
చికిలిపైఠాణికంచుకము గీలించి చొక్కము లైనమణులహారములు వైచి
సొగసుగా నుదుటఁ గస్తూరిరేఖ యమర్చి కళుకులు ముద్దుచెక్కుల ఘటించి


తే.

గోరజవ్వాదిపదనిచ్చి గూడదువ్వి, కుసుమగర్భంబుగా జాఱుకొప్పుఁబెట్టి
చవులచేర్చుక్క సీమంతసరణిఁ గూర్చి, కన్య నిష్టాన్నసంతుష్టఁగా నొనర్చి.

391


ఉ.

కూరిమి బుజ్జగించి యనుఁగుంజెలువ ల్దనుఁదేర సమ్మదాం
కూరమహావిలంబమునకుం బనిలే దనఁ బోకుపోకుమం
చూఱటలేక సిగ్గుతరువుండగ ముందఱఁబోయి పిమ్మటం
గ్రూరవిసాణమేషమయి కొమ్మ చనుం జనలేక క్రమ్మఱున్.

392


ఆ.

వనిత నిలిచి నిలిచి వచ్చుచు మంజీర, మండనములు మాని మాని మొరయ
లజ్జ విడువరాదు లావణ్యవతులకుఁ, బ్రాణనాథుతగులుఁ బాయరాదు.

393


వ.

ఇట్లు కేళిమందిరంబు చేరందెచ్చి.

394


ఆ.

చెలులు బలిమిఁజేసి పిలిచినఁ దల్పంబు, చేరరాక సిగ్గు చేర్లుకొనఁగఁ
గ్రొమ్ముడియును మోము కొండొకచూపట్టఁ, దలుపు దండగొనుదు నిలిచియుండె.

395