పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆవిరితీవబోఁడికృప కద్భుతమంది భవన్నియోగ మే
లావృథయౌ ఫలింపక బలా యబలా యని విప్రుఁ గొంచు ర
క్షోవిభుఁ డేగి పీనుఁగున సుప్రదతీర్థమునం దొరల్చి సం
జీవితుఁ జేసి మందిరముఁ జేర్చి భజించి కుమారి కిట్లనున్.

300


క.

చనిపోయిన నీయెజ్జలు, మనుగడఁ గనియె న్వసించె మందిరమున నో
తనుమధ్యా మొగిడించిన, కనుఁగవతో నిలువు రాజుకడ నినుఁ జేర్తున్.

301


చ.

వలదు విలంబ మన్నఁ బ్రతివాక్యము లాడక మోడ్సుకంటితో
నిలిచిన బ్రహ్మరాక్షసుఁడు నిర్భరవేగధురాధురీణుఁడై
పొలఁతుక నప్పు డెత్తుకొనిపోయె మనోజవుఁ డౌట నిల్చఁ బా
టలనగరోపకంఠనిబిడద్రుమకాంచనసౌధవీథికన్.

302


వ.

ఆసమయంబున.

303


శా.

గొందు ల్వీడ్కొని పక్కణాంతరకుటికూటాధ్వసంధు ల్పరా
స్కందు ల్చూడ నవక్రచక్రములు ముచ్చ ట్లాడ నిచ్ఛారతిన్
గ్రిందు ల్మీఁదులుగా సతీపతులు గౌఁగిళ్ళూళ దీప్తు ల్దిశ
ల్పొందుల్ గూఢఁ ద్రిభంగిభంగి మొరసెం బుంస్కుక్కుటవ్రాతముల్.

204


చ.

అతికృతికన్య నందినమురారివిరాజదనంతభోగసం
స్థితి ప్రతివారముం బొదల శిష్యులు పుణ్యజను ల్జయక్రియో
న్నతులు దురంతశాస్త్రకలనం బ్రతివాదుల నోర్వ సర్వతో
గతమతికుండు నిల్చెఁ గవికౌశికదిక్కటకాగ్రపీఠికన్.

305


చ.

వరవసులక్ష్మి నుల్లసిలువారికి నేమిగొఱంత యీవిభా
కరునకు సంజనిచ్చి తిరుగంబడి లక్ష్మి హరింప నెట్టిదో
నెరవులసొమ్ము సత్య మగునే యని వెల్వలనయ్యె వహ్ని నాఁ
బరిగళితద్యుతి న్వెలకఁబాఱె నిశాంతనిశాంతదీపముల్.

306


చ.

కనుఁగొని చైత్యనిత్యపథికప్రవిబోధకరంబులై ఖగ
స్వనము లుదగ్రబాహ్యవనవాటికల న్విననయ్యె నయ్యెడన్
ఘనమదభృత్తమఃకరకంపితేదిగ్విటపస్ఫురన్నభో
వనరుహసంక్షరత్కుసుమవర్షముచాడ్పున జాఱెఁ జుక్కలున్.

307


సీ.

ధారాధరస్మయోదయవియచ్చిరకురబంధమునఁ దారాలతాంతములు రాలె
రోదసీతనుసమారోహాంధకారైణమదవిలేపనరేఖ మసలిపోయెఁ
జక్రవాకస్తనస్థాతృనీహారఘర్మాంబువు ప్రత్యక్షమై యడంగె
మధుపకజ్జలభాసమానకైరవలోచనముల నిద్రాముద్ర ననలుపెట్టె