పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సుడివడి యింటిత్రోవ యనుచుం బెరచొప్పునఁ బోయిపోయి యా
ప్పడఁతి దృషద్వతీసరిదుపాంతదురంతవనాంతరంబులం
బడి ములుదీపలుం దవిలి భంగములై కురులుం దుకూలముం
దొడివినకంచుకం బెడలఁ దొట్టినభీతి నొడ ల్వడంకఁగాన్.

270


క.

ఈరము లూఱట నొందక, దూఱును నో రలయ నలున దూఱుచు రొంపిం
జాఱుచు నెంతేవెలవెలఁ, బాఱుచు రాజన్యకన్య పఱచి యలంతన్.

271


శా.

ఆయుగ్రాటవి వొక్కచోట భయదంబై తోఁచురక్షోవట
చ్ఛాయం బీనుఁగుఁ ద్రొక్కి కోమలకరాబ్జాతంబునం బట్టి య
య్యో యీమానవుఁ డెవ్వఁడొక్కో మృతి కేమో హేతు వంచు న్విచా
రాయత్తం బగునాత్మఁ బోఁ దెరువులే కచ్చోటఁ దా నున్నెడన్.

272


క.

ఆవటమునఁ ద్రింశద్వ, ర్షావధిగా నున్నభూసురాసురుఁడు విశా
లావరపుత్రికి హితసం, భావన సాక్షాత్కరించి పలికెం బ్రీతిన్.

273


క.

మనుజులు మిట్టాడని యీ, ఘనగహనంబున నిశీధకాలమునం జ
చ్చిననరుచక్కటి తెకేకటిఁ, దనుమధ్యా సంచరించెదవు నిశ్శంకన్.

274


తే.

ముంచుకన్నీరు మంచున మోముదమ్మి, వాడియున్నది దీర్ఘనిశ్వాసనిహతిఁ
దల్లడిల్లెడునధరోష్ఠపల్లవంబు, ఇంతవలవంత నవ్వ నీ వెవ్వ రనుచు.

275


క.

అనుమానింపక తనుభృ, త్తనువిసర నపారసప్రదానవిధాన
స్వనదుల్ముకంబు వదనం, బున ద్రిప్పుపలాశి కిందుముఖి యిట్లనియెన్.

276


క.

వినయవిశాల విశాలా, వనిపాలునిపుత్రి దైవవశమున నస్మ
జ్ఞననీజనకుల జనకుల. వినతులపొ త్తెడసి యాటవికసతి యయితిన్.

277


శా.

ఏ నిల్సేరుట యెట్టు లీపడినవాఁ డెవ్వాఁడు వర్షాతమః
పౌనఃపున్యముఁ దెల్పునల్పుచపలాప్రత్యర్థు లాలోకముల్
మేనభ్రంలిహ ముగ్రమృత్యుముఖగంభీరంబునో రెవ్వ ర
య్యా ని న్జూచిన గుండె ఝల్లురనుఁ దథ్యం బానతీవే యనన్.

278


మ.

అతఁ డత్యంతతమప్రసన్నహృదయుండై పల్కె నే నంచిత
శ్రుతిసంపన్నుఁడ బ్రహ్మరాక్షసుఁడ నిచ్చోఁ కాపురం బుండుదున్
మతి భీతిల్లకు నీకు నొజ్జ లితఁ డమ్మా నీకు నేకారి యీ
క్షితిజచ్ఛాయ మనోజబాణహతి నొచ్చె న్మాట లింకేటికిన్.

279


క.

గురుఁడ నిది శిష్యురా, లీతరుణీమణి గవయ దుష్కృతం బని మదిలో
నరసి యెఱుంగనియీదృశ, నరపశువుల మేలు పొందునా యెందైనన్.

280