పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఆదిత్యచోదితుండై క్రోధించి.

257


శా.

అయ్యో నేఁ డిట కేఁగుదెంతువని నీ కాశించి యిచ్చోట గ
మ్మయ్యంజాలక నిద్ర గాచి యిపు డేమోకూర్కితి న్మూడుజా
లయ్యె న్నాలవజాముఁ జొచ్చె దడవాయ న్వచ్చి విచ్చేయునీ
సయ్యాటం బిఁకఁ జాలు రోసితి ననుష్ఠానార్ధినై పోయెదన్.

258


చ.

కడువడి రెండుజాము లరుగం బరిరంభణ మీఁదలంచి నీ
కడ కరుదెంతు రానిపనిగల్గిననాఁటికిఁ దండ్రిఁ గాశిలోఁ
బొడిచినక్రూరకర్మమునఁ బోవుదు నంటివి సూనృతంబు నీ
కొడుకయిపోయె రాక కిదిగో గురులింపజరాత్రిపాపముల్.

259


క.

కడుసరసములకుఁ బ్రొద్దె, క్కడిది దురంతోపగూహగతులకుఁ బ్రొద్దె
క్కడిది యొకనెలవు సేసితె, కడజామున వచ్చి చాల్చొకాఱుకుబుద్ధిన్.

260


ఆ.

కొదవలేక రతుల గోవావుఁగోడెనై, పొదలఁ బెద్దతడవు ప్రొద్దులేదు
నొరసి తెడ్డు నాఁకి యుపవాసకర్మంబు, చెఱుచుకొనఁగ దీనిచేత నేమి.

261


క.

అని చిందరేఁగిన ట్ల, చ్చెనఁటిధరాసురుఁడు చెంతఁ జేపడిననిధి
న్మునిగాలఁ దన్ని చనుగతి, ఘనజఘనం బాసి యబ్బగాఁడుగఁబోయెన్.

262


క.

చనఁ దనకు మనసువచ్చిన, పని యది గా కునికిఁ దీరఁ బట్టక చనుఁగా
కని యూరకుండె న ట్లుం, డి నరాధిపకన్య దనదుడెందములోనన్.

263


క.

సరిప్రొద్దున నరునెంచితి, నరుణోదయసమయ మెట్టు లయ్యె దురంత
స్మరమాయాంధుఁడు గావున, నరరే విప్రుండు తుర్యయామం బనియెన్.

264


క.

కామాంధోపి నపశ్యతి, నా మును నే విన్నదాననకదా వెఱఁ గే
లా మందునిమాటల కని, యాముద్దులగుమ్మ మందహాసముఁ దాల్చెన్.

265


క.

నానీరచరాగ్రణి బహు, మానున కిట్లనియె నట్లు మహిసురుఁ డన్య
స్థానస్థుఁ డయినపిమ్మట, నానెలఁతుక యేమి సేసె ననఁ గపి పలికెన్.

266


క.

మహిసురుఁ డట్లరిగిన న, మ్మహిళారత్నంబు తొడసు మాలితి నని దు
స్సహరయమున భయమున నిజ, గృహమునకుం బోవఁ దత్తరింపఁగ నంతన్.

267


చ.

ననదసమృద్ధి నీలికడవంబలె నంబర మొప్పఁ జంచలల్
మినమినలీన దోన నుఱిమె న్వడి గండులు వ్రాలె వ్రాలెఁ దొ
ల్చినుకును దూర్పుఁటీద రొలసెం బలసెం జడివానసోన జో
తనఁ బుకవిద్విషద్గళసహస్రభవాకృతిఁ బర్వెఁ జీఁకటుల్.

268


క.

ఇది రాయిరప్ప పల్లం, బిది మి ఱ్ఱిది మాకుమట్ర యిది పా మిది గా
మిది యని వివరింపఁగఁ బె, ట్టిదమై యొప్పెసఁగు నక్కటికచీఁకటిలోన్.

269