పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాకు లర్థించి యలబలం బడఁగు టరసి, యునికి వెలువడి బ్రాహ్మణుం డొక్కరుండు.

244


ఉ.

అప్పు డధిజ్యచాపధరుఁడై మరుఁ డేర్పడి వెంటనంటి రాఁ
జొప్పున జాలి మాలి యఘశూరుఁడు పాఱుఁడు వచ్చివచ్చి యా
యొప్పులకుప్పరామికి నయో విధియం చుదితాశ్రుధారలుం
గప్పఁగ మోము నిశ్వసనకంపితచారుతరాధరోష్ఠుఁడై.

245


క.

చెదరెడిమేనును జెక్కున, గదిసినకెంగేలు గ్రాలఁగా విప్రుఁడు లే
నిదురెఱుఁగనికంటం బడి, వదియగుమరుమంట మంటపంబున నుండెన్.

246


ఆ.

చీమ చిటుకుమన్నఁ జిమ్మెట బుఱ్ఱన్న, నెదుర మూషకములు మొదలుకొనిన
నిదుర లేక భూమినిర్జరుం డాలించు, నప్పు డబలకాలిచెప్పు డనుచు.

247


క.

రాదాయెఁ జూచితే యను, రాదా యడ్డంకిబట్టి రాదను నిర్మ
ర్యాదలు సీమంతినులను, హా దైవము ప్రొద్దుపోయె నని తలయూఁచున్.

248


క.

 ఎదురుకొన నరిగి చాయకు, గదలుతలారులకు వెఱచి క్రమ్మఱు నే
నమ్మదవతికి నేలదాదులు, పొదివికొన న్నిదురపోయెఁ బొమ్మని పలుకున్.

249


వ.

ఇట్లు మోహానలంబున దేహంబు విదాహింప నయ్యుర్వీగీర్వాణుండు చలితవియో
గిప్రాణుం డగుపంచబాణుం దలంచి.

250


మ.

ద్విజరాజుం దలదాల్చుకొన్నతనిదృగ్దృష్టిప్రభూతాగ్నులన్
రజమై పోయిననిన్ను నీతిరసదూరా మార యీకేవల
ద్విజరా జల్గిన నేమిసేయునొ ప్రశాంతిం గాంతి మత్సాయక
వ్రజముం గూర్పకు నారి నారి నను గూర్పం దేర్పఁ బుణ్యంబగున్.

251


చ.

శివ గణనాయకా యనిన శ్రీఘ్రమె కార్యము లడ్డపాటులే
కవు యదునాథపంచవిశిఖా యన హస్తపదాస్థికాండముల్
చివికెడువట్టినొప్పు లొడిసె ల్రసపొక్కులు గంట్లు బిబ్బపుం
డ్లవు నిటువంటిపుత్రుఁ దగవా కన నమ్మదుకైటభారికిన్.

252


వ.

అని పనివి పనివి యనంగబాణమూర్ఛితుండుంబోలె నమ్మందుండు నిద్రాముద్రా
లోచనుం డయ్యె నయ్యవసరంబున.

253


క.

ఆనిశ ధరణీసుతునకుఁ దా నిచ్చినమాటపట్టు దలఁచి తేదీయ
స్థానీయపాలవీక్షా, ధీనాకృతిగాక నగ రతిత్వర వెడలెన్.

254


క.

జలధరమాలికలోపలి, తొలుకార్మెఱుఁ గనఁగ యమవిధుంతుదహాలా
హలకాచమేచకద్యుతి, గలనీలాంబరము ముసుఁగుగాఁ గైకొనుచున్.

255


క.

పరివృత్తకంఠయై దిశ, లరయుచు నడ దడవడంగ నరుదెంచి ధరా
సురు నిద్రపోయెదే యని, కరసంజ్ఞం దెలుప మేలుకని వాఁ డంతన్.

256