పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అతివా నారతిలో నీ, పతిరతిలో నిష్ట మెద్ది పలుకం దగునం
చతఁ డడిగిన హితరూపా, న్వితుఁడని న న్నబల పొగడె వీనిం దెగడెన్.

289


ఉ.

వంచన యిప్పు డీతులువవంక జనించె జనించుఁగాక యీ
చంచలనేత్రి నాయెడఁ బ్రసన్నమనోరథ దీనిమాటలన్
గాంచితి మోదమంచు రథకారుఁడు వేగ సజారదారతో
మంచము నెత్తికెత్తుకొని మంజుగతిం జని వాడవాడకున్.

290


ఉ.

వాకొని యెంతశాంత యెటువంటిపతివ్రత యెంతయుత్తమ
శ్లోకవివేకరాశి యనుచుం బ్రియ నెన్నుచు హస్తతాళమా
నైకలఘుప్రచారగతి నాడెఁ బ్రహాసవిలాసవక్త్రులై
మూఁకలు గట్టి నాగరికముఖ్యులు త న్బరికించి నవ్వగన్.

291


వ.

ఇచ్చరిత్రంబు సాపరాధుం డగు చిరజీవిం జేపట్టిన నీ కుదాహరణం బగు నని
రక్తాక్షుండు చెప్పిన నప్పలుకు లాదరింపక నులూకేశ్వరుం డూరకుండె నంత నయ్య
భిప్రాయ మారసి.

292


క.

తనకు నులూకత్రాసము, మనుగడ కుపహతియు నబహుమానత్వము లే
దని తెలిసి తెలివిఁ గలయా, వనమునఁ జిరజీవి ఘూకనాథుని కనియెన్.

293


క.

నీరిపుచే నూరక యవ, ధీరణఁ గాంచితి జగద్విదితమతి నయ్యున్
గ్రూరాగ్ని కాహుతిగ దను, ధారణ మిఁకజాలు వేల్చెదం బ్రాణంబుల్.

294


క.

నావిని రక్తాక్షుఁడు చిర, జీవిం బరికించి చచ్చి చేసెడుపని యే
మీ వివరపుట్టఁ జెపుమా, నీ వనుటయు నాతఁ డాతనికి నిట్లనియెన్.

295


క.

ఈకాయ మనలముఖమునఁ, బోకార్చి యులూకయోనిఁ బుట్టి బలిమిమైఁ
గాకముల గర్వరేఖా, స్తోకములం ద్రుంతు మనసుతుందుడుకాఱన్.

296


వ.

అనిన విని రక్తాక్షుండు.

297


క.

లోకదృశుఘనసమీరమ, హకుధరంబుల వరింతు నని కాదా పూ
ర్వాకృతికి వచ్చె నొక్కతె, కాకికి నీకేల కౌశికత్వము గల్గున్.

298


క.

అనురక్తాక్షునిఁ గనుఁగొని, ఘనుఁ డచ్చిరజీవి వలికె గాఢప్రజ్ఞా
ధన వినఁగోరితి నిక్కథ, యనురక్తిం జెప్పుమనిన నతఁ డిట్లనియెన్.

299


సీ.

కైటభాహితపదాంగదమౌక్తికచ్ఛాయ విధికమండలుసమన్వితమరాళి
మారారిమకుటమందారమాలిక వియత్కృష్ణధేనుక్షరత్క్షీరధార
సాధుజీవంజీవచంద్రిక సగరజస్ఫాటికస్వర్గసోపానపంక్తి
చిరతపోవిత్తసంచితభగీరథకీర్తివారాశిహృదయకర్పూరచర్చ