పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాగరిక మేదివిప్రుఁడు, వేగలమున నిలిచి భ్రాంతి వికలుం డగుచున్.

147


క.

ఒకరిరువురు గా కందఱు, నకటా ఛాగంబుఁ గుక్క యని పోయెద రే
టికి బ్రమసి వేఁపిఁ దెచ్చితిఁ, దుకతుక నను నవ్వకుండుదురె తత్త్వజ్ఞుల్.

148


వ.

అని విహరణస్థలదచ్ఛాగం బగుభాగంబు విడిచి విప్రుండు పూర్ణశరం బగుకాసా
రంబునకు స్నానార్థియై చనియె నప్పుడు ధూర్తులు ప్రహాసభాసమానావను లగుచు
నొండొరులకరంబు లప్పళించుకొనుచు నయ్యజంబుం జంపుకొని భక్షించి రబ్లు
ప్రజ్ఞాశౌర్యధై ర్యాధిగుణంబులు గలవారలు పరులకార్యంబుల విఘాతంబు సేసి
స్వకార్య ముద్ధరింతురని మఱియుఁ జిరజీవి మేఘవర్ణు నాలోకించి.

149


క.

తనలావుఁ జూచి మృతకా, కనికాయశరీరరక్తకణములు మేనన్
జినికి వటతటమునం దిడి, చనుఁ డుపహతిరహితభూమిజాతంబులకున్.

150


క.

అరివద్ద నుండు సరిప్రొ, ద్దరుదెంచుం గెరలి తరలి హతశేషరట
త్కరటహృతి కట భజింతున్, హరుఁ డాపగవారిఁబోలె నాపగవారిన్.

151


వ.

భజించి నీకార్య మార్యసమ్మతంబుగా నిర్వహింపం గలవాఁడనని పలికిన మేఘవ
ర్ణుండు లుంఛితగరుజ్జాలుం గావించి విస్రం బగు కాకజఠరాస్త్రంబుఁ జినికి యచ్చి
రజీవిని న్యగ్రోధాగ్రకోటరంబునం బెట్టించి సపరివారుండై నిరుపహతిస్థానం
బున కరిగె నాసమయంబున.

152


చ.

అరుణగభస్తిబింబ మపరాద్రిఁ దిరోహితమయ్యెఁ బన్నగా
భరణి శిరోధిహాలహలభంగి నిఱు ల్నెరసె న్విరోధిభీ
కరగతి వంతగూఁబపరిగాఢమహీధరభూజదుర్గకో
టరములు నిర్గమించి వికటప్రకటాననము ల్ముడించుచున్.

153


క.

అరిమర్దనుఁ డనుపబల, స్ఫురణోల్లోకములు ఘూకములు వటకరటా
హరణేచ్ఛఁ గదలి బహుపా, ద్ధరణీరుహ మాశ్రయించి తద్విటపమునన్.

154


క.

కాకములు మెదలకున్నన్ ఘూకంబులు కర్ణఘోరఘూత్కారహతా
శాకులము లగుచుఁ గ్రమ్మఱి, పోకకు నఱ్రాడుచున్నపుడ భూజమునన్.

155


క.

మతివిదులకు నుచితమనూ, ద్యతనము సారంభుఁడయ్యు నాకృతకార్య
స్థితిఁ గడఁగనియునికి మహో, న్నతి యని మను వానతిచ్చినాఁ డట్లగుటన్.

156


క.

అని తలఁచి నిలిచి ఠీవిం, బనివడి చిరజీవి యేరుపడ నొకనెట్టెం
బొనరించినఁ గ్రమ్మఱి పరి, మునుమై యత్తొలులఁ జుట్టుముట్టె న్బట్టెన్.

157


క.

పట్టుకొని చంప నొంపం, గట్టాయితపడక యరుగుఁ గావున నతనిం
జుట్టమువలెఁ గొనిచని పతి, కట్టెదురం బెట్టి కౌశికంబులు నిలిచెన్.

158