పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రత్యాసన్నవిరోధికులం బభావంబగుట ద్వైధీభావంబు పొసంగదు సంశ్రయం
బన్నిటికిం గర్తవ్యంబు విను శరీరపతనపర్యంతంబు నీకార్యంబునకేఁ బాబుపడఁ
గలవాడ.

139


క.

పలువురుకృతవైరుల మతి, బలధుర్యులు విమతులున్నఁ బరకార్యంబుల్
పొలిసిపడుం జెడు మునుధూ, ర్తులు మేకం గుక్క జేసి తోలరె విప్రున్.

140


క.

నావిని వాయసపతి చిర, జీవికి నిట్లనియె నీతిశీలా యేలా
గీవిధము తేటపడజెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

141


సీ.

చెనఁటి యాకులపాటుచే నలంగినసాధుతరుల కుబ్బొసఁగు నాదరణమూ ర్తి
భీమతీవ్రాంబకాభిహతి స్రుక్కిన మహామధురధర్మునినొప్పి మాన్పువెజ్జు
ఫలభంగమున మాటపట్టుజాఱిన పైకమునకు సత్యోక్తు లిచ్చినసుదాత
హాలినున్మత్తచండాలుర మాధవార్చనదురంధరులఁ జేసిన ఘనుండు


తే.

కాలగతిఁ బేర్చు నలజళ్ళఁ గలఁగఁబడిన, సరసులకు నిర్మలత్వంబు సంఘటించు
సౌఖ్యసందాయకుండు సాక్షాత్కరించె, సన్నుతానంతుఁ డవనివసంతుఁ డంత.

142


సీ.

ముక్తపత్రవ్యాజమునఁ జీరసడలించి కళికలఁ న్పులకల గలుగఁజేసి
పొలివోనితావులఁ బూవుదండలఁ జుట్టి కడలేనిమధుసాత్వికమునఁ దేల్చి
రణదళిఝంకారమణితము ల్ఘటియించి దీవిచక్కెరలూఱు మోవియాని
సరవినున్నతఫలస్తనములఁ గబళించి కళదేఱుతనువల్లి గౌఁగిలించి


తే.

కలికిరాచిల్కపల్కుఁ బల్కుల నలర్చి, సురభికర్పూరరజముల సొంపొనర్చి
కలితననలక్ష్మిఁ గూడి రాగము వహించె, మాధవుఁడు హృష్టనిఖిలక్షమాధవుండు.

143


వ.

మఱియు నవ్వసంతంబు కళికాభిరామంబై యుదాహరణంబును శుకసూక్తిసందర్భ
గర్భితంబై భాగవతంబును గలకంఠీకలాపదీపితంబై రాజావరోధంబును బ్రకాశిత
ప్రవాహంబై సముద్రతీరంబును సందృష్టశారికాజాలంబయి వీణాయంత్రంబును
బురుడించు నక్కాలంబున.

144


చ.

కలఁ డిల ముగ్ధభూసురుఁ డొకానొకఁ డాయనయధ్వరార్థమై
బలిసినమేఁకపోతు మెడ పగ్గమునం బిగియించి యీడ్చికొం
చలవున నింటికై యరుగ నప్పుడు గొందఱు ధూర్తు లిచ్ఛలో
పలఁ దలపోసి యయ్యజముఁ బాపపఁదలంచిరి దుర్ణ యంబునన్.

145


క.

తలఁచి యొకఁడొకఁడ చని లో, కులు నవ్వ న్విప్ర కుక్కఁ గొనిపోయెదు నీ
కులశీలంబులు వఱదం, గలపితి విఁక నేమి యని వికావిక నగుచున్.

146


క.

ఈరీతి నందఱు యజన, చ్ఛాగముఁ గుర్కురముఁ జేసి చనుచుండంగా