పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డనునయవాక్యము ల్మెఱయ నాక్షణ మంఘ్రిపరీతవాగురం
దునియలు సేసి మందరకు దూఱి యథాయథలయ్యె నయ్యెడన్.

224


క.

జలచరుఁడు గనవరత్వర, నిలబోవం జేవలేక యెప్పటిచో ని
ర్గళితగమనేచ్ఛఁ గచ్ఛప, కులనాధుఁడు శిరము ముడుచుకొని యుండుటయున్.

225


క.

సరినురికిఁ బాసి గాఢ, త్వరఁబఱచినమృగముఁ జూచి దారుణచింతా
పరితప్తుఁ డగుచు మృతయుఁడు, మరుగుచు నచ్చో ముహూర్తమాత్రము నిలిచెన్.

226


వ.

అట్లుండి ముందర మందరకుం గాంచి పట్టుకొని త్రాటం గట్టుకొని వింటికోపునం
బెట్టుకొని విన్ననైన మొగంబునం దిరిగి యరుగుచుండె నప్పుడు హిరణ్యకలఘుప
తనకచిత్రాంగదు లంతంత ననుసరించి చనుచుండి రందుందురు పురందరుండు
తనలోన.

227


ఆ.

అంబురాశిపార మైనను గనవచ్చు, నిశ్చయింపవచ్చు నింగిపొడవు
బ్రహ్మ మిట్టి దనుచుఁ బలువంగనగు సుహృ, ద్విరహ మింత యనుచుఁ దెలియరాదు.

228


తే.

అదియ సువ్యక్త మది నిజప్రాణతుల్య, మదియ నిర్వాచ్య మట్లు గాదయ్యెనేని
జననిపై భార్యపైఁ దనూజన్ములపయిఁ, గలిమిపై మైత్రిపైఁ బోలెఁ గలదె మమత.

229


సీ.

కర్మచేష్టితములు గాలాంతరావర్తితము లగుమేలుగీ ళ్శమరు నైనఁ
గనుఁగొంటి మరి సమాగమవియోగము లేల చెనఁటివిధాత సృజించె మొదలఁ
బృథులశోకారాతిభీతిఘాతిప్రమోదసంపాదిప్రీతివిస్రంభభాజ
నము మఱి రెండక్షరములఁ బూర్ణంబైనమిత్రశబ్దముమేర మెఱసి విడిసి


తే.

యెట్లు నిలువఁగూడు నెబ్భంగి రుచియించుఁ, గూడు కంటి కెట్లు గూర్కు వచ్చు
నని హిరణ్యకుండు దనలోన దుఃఖించి, యపుడు పలికె వాయసాధిపతికి.

230


క.

ఈయధముఁ డెంతదూరము పోయెడునో యెంతదవ్వు పోదము సర్వో
పాయములఁ గానలోపల, నీయెడ విడిపించుకొంద మిమ్మందరకున్.

231


క.

నావిని లఘుపతనకుఁడును, లావుపసం బోర నలఁతులము మందరకుం
డేవడువున విడివడు నీ, చే వీనికి దిక్కు చెప్పవే వెర వనినన్.

232


సీ.

అశ్రుమిశ్రితనేత్రుఁ డైనహిరణ్యకుఁ డనియె నిప్పాపాత్ముుఁ డరుగుత్రోవ
గలగు చెందామరకొలను దత్తటమున మృగముఖ్య చచ్చినపగిది నుండు
నేమించి యౌదల నిలిచి లోఁజెవులను ముకుగోళ్ళఁ బొడుచున ట్లొకట గన్నుఁ
గ్రుడ్లూడ్చి మెసవులాగున నుండు ముండిన నాపూఁట కచ్ఛపనాథుఁ బ్రోవ


తే.

వేగఁ గేడించి యన్నీచు వెనుకఁ జేసి, యరుగు మచ్చక్కి కనికూర్చి యనుచుటయును
ఖగమృగాధ్యక్షు లరిగి రాఘనులపజ్జ, నంత నంతట దానును నరుగుచుండె.

233


సీ.

చిత్రాంగదుండు చచ్చినవానిగతిఁ బుతస్సరణసరస్తీరధరణి నుండె