పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వనుల న్సద్వనులం గులప్రభులతో వర్తింతుఁగా యంచు బా
ష్పనిరుద్ధాక్షుఁడనై సఖా మనుజభాషం బల్కితిం బల్కినన్.

213


చ.

విని యువరాజు ద్రాపరసవిహ్వలుఁడై సదనంబు నల్దెస
ల్గనుఁగొని యేను నీమృగమకాని యొరు ల్విహరింప రిందుఁ జె
ప్పను వినఁగూడునే మనుజభాషల నిప్పశు నద్భుతధ్వనిం
బనివడి మ్రోసె వేగి తెలుపందగు నీతెఱఁ గెల్లవారికిన్.

214


క.

అని తనువు వేఁగ వేగినఁ దన కాపుష్కకనరేశుతమ్ముఁడు నెమ్మిం
గనుగూర్క వేఱచి యొకలా, గున నంతయా దైవచింతకుల కెఱిఁగించెన్.

215


క.

ఎఱిఁగించి మృగము లెక్కడ, తరి నేతన్మనుజభాషితము లెక్కడ నే
తెఱఁగో యేయుత్పాతమొ, వెఱఁగయ్యెడు ననిన నవ్వి విద్వత్సింహుల్.

216


క.

యువరాజుఁ జూచి ధరణీ, ధవనందన యేల వెఱచెదవు మృగజాతుల్
పవ లూరకుండి నిశ నవ, నవభంగి న్మనుజభాషణంబులఁ బలుకున్.

217


క.

నరసంచారవిహీనో, ర్వర వని చెప్పుటయు భయము వదలి నృపాలా
వరజుఁడు నను విడిపించెను, గరుణాపరుఁడై దురంతకాంతారములన్.

218


క.

ఇది నాకు నేఁడ కా ద, మ్మొదలం గల దనుచుఁ దెల్లముగ మృగము జగ
ద్విదితుఁ డగు నెయ్యునకు నా, ర్తదశం దడిలేనినోరఁ దనకథఁ జెప్పెన్.

219


క.

అతివేలచింత నంతట, వెత మదిలో నెరపి సరసి వెలుబడి మంద
స్థితి చాయఁ జూచుకొని య, ప్రతిమదయాశరధి మందరకుఁ డేతెంచెన్.

220


క.

ఏతెంచిన భీతి విని, ర్ఘాతహతిం ధృతినగంబు వ్రయ్యలుగా జిం
తాతంతుబద్ధమానసుఁ, డై తత్తర మెసఁగ మూషకాగ్రణి పలికెన్.

221


చ.

అరయ నుపాయపారగుఁడ వయ్యు నయోదధివయ్యు సంతత
స్థిరమతివయ్యు గానిపనిఁ జేసితి నర్మసఖా మృగంబు ని
క్కరటము నేను నెప్పటికీఁ గాల్గలవారము చిక్క మేరికి
ట్లురుగతి నీకు లే దిచటి కుద్ధురుఁ డామృగయుండు వచ్చినన్.

222


చ.

అతివిమలాత్ముఁ డైనసఖువందును బెంపొనరించుధారుణీ
పతివరునందు భూరిగుణబంధుర మైనకళత్రమందు ను
న్నతనయతత్వశాలి యగునందనునందు మనంబు సొన్పి యా
గతబహుదుఃఖము ల్డొఱఁగుఁ గాదె విచారధురీణుఁ డుర్వరన్.

223


చ.

అనునెడ వేఁటకాఁ డదయుఁ డప్ప డుపస్థితుఁ డైన దైన్య మా
ననమున మోసులెత్త మృగనాథుఁడు బెగ్గిలినన్ హిరణ్యకుం