పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముఖరితములు రాజశిలీ, ముఖములు బహుపుండరీకముఖముల వ్రాలెన్.

203


క.

తారలు చెడ నుడ్డీనో, దారగతు ల్నెఱపి గగనతలమున జవవ
ద్భేరుండము లాస్యముల న, పారముగాఁ గొనియె రాజబాణఫలంబుల్.

204


క.

తులలేని శైత్యములుఁ జిఱు, బిలముల బురుడించుదొనలఁ బెరిగినశరముల్
పొలములు లాయంబులగళ, ములు మోపగఁ దుండషండములఁ బూరించెన్.

205


క.

నిరవధికదానవిద్యా, పరఘనుఁ డాఘనుఁడు దాత ప్రజ్ఞాని వనే
చరమృగచరజాంగకములు, శరధిపృషత్కముల సరభసంబునఁ గప్పెన్.

206


క.

సమయించె ఖడ్గముల ఖ, డ్గములం గ్రూరాచ్ఛభిల్లగణముల జగతీ
రమణుఁడు దుర్గాహవన, క్షమఁ గ్రూకతరాచ్ఛభల్లగణములు గప్పెన్.

207


వ.

అయ్యాఖేటనంబు శాసితపశుప్రకరంబు గావున యజనవాటంబును ధ్వనిప్రధా
నంబు గావున సుప్రబంధంబును భంగదుర్నీరీక్ష్యంబు గావున బయోనిధానంబును
నఖండధర్మమసంపన్నంబు గావున గృతయుగంబును నిరూఢఋశ్యశృంగంబు గావున
విభాండకాశ్రమంబును శిధిలీకృతాచ్ఛభల్లంబు గావునఁ బ్రభగ్నసంగ్రామంబును
గుంతీష్టవిహారయోగ్యంబు గావునఁ బాండురాజార్జనంబును నష్టసింహబలంబు
కావున భీమసేనోత్సాహంబును నపాస్తసింధురాజంబు గావున ఫలితార్జునప్రతి
జ్ఞయు నికుంచితవంచకంబు గావున రాజనగరంబును నిశ్చేష్టితగవయంబు గావునఁ
గుంభకర్ణసంరంభంబును సప్రకాశితపుండరీకంబు గావున శిశిరకాలంబును ననుకరించె
నప్పుడు.

208


క.

పోలములు వెదకి పక్కణ, పాలురు తఱుముటయుఁ దల్లి ప్రజ లుద్ధురజం
ఘాలురు గావునఁ బరచిరి, పోలేకం దగులుపడితిఁబో వారలకున్.

209


క.

నను నంతఁ జిత్రవర్ణుఁడు, గనిఁ జంపక తెచ్చి పతికిఁ గైకానుకగా
నొనరించిరి శబరసుతు, ల్విను రా జవ్వేటమీఁద విరిగె న్దిరిగెన్.

210


వ.

తిరిగి మహిమహిళాకటకం బగుకటకంబునకు వచ్చి రాజు యువరాజునకు న న్నిచ్చె
నిచ్చిన నచ్చెలువుండు నన్నుఁ గన్ననందనుకంటె నగణ్యకారుణ్యంబున రక్షించె
నట్లు కుక్షిద్రక్షితుండనై యుండి యంతఃపురంబున వాసగృహంబున యువరా
జొక్కరుండు పవ్వళించియుండ నేనును దత్సమీపంబున నుండితి నయ్యర్ధరా
త్రంబున.

211


క.

ప్రతిగర్జత్కేసరియై, యతికంపజ్జంతుహృదయమై నిర్భన్న
శ్రుతిహృత్పుటమై విద్యు, ద్ద్యుతివాంతధ్వాంత మగుచు నొకయుఱు ముఱిమెన్.

212


మ.

తనకర్ణంబుల కెంతయాఘననినాదం బూర్జితామోదకం
బొనరింప న్ముఖమెత్తి వానతఱి యయ్యోపర్వతాధిత్యకా