పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొరయం గోరనివాఁడువో పురుషుఁ డొప్పు న్వానిఁ కీర్తింపగాన్.

173


చ.

విటపసమృద్ధిభూజముల వీవలుల న్విరుల న్మరందలి
ట్పలివియత్ప్రదేశమునఁ బక్షులు వారిమరాళమండలం
బెటువలె నాశ్రయంచి బల మెవ్విధిఁ గైకొను నేము నిట్టిచో
నటువలె నిన్నుఁ జేరి ముద మందెద మోకమఠాన్వయాగ్రణీ.

174


వ.

అని లఘుపతనకుం డనేకప్రకారంబుల మందరకు నుత్కర్షింపుచుండె నాసమయంబున.

175


మ.

చకితస్వాంతముతో మహామహిరజశ్ఛన్నప్రతీకంబుతో
వికసద్వక్త్రముతో బృహద్గతిజనిర్వేదైకనిశ్వాసవీ
చికతో బమ్మెరపోకతో నటకుఁ గశ్చిల్లుబ్ధకక్షోభ మొం
డొకకాంతారమృగంబు భిన్నఖురటంకోదగ్ర మేతెంచినన్.

176


క.

మ్రానికిఁ బొఱియకు సలిల, స్థానమునకుఁ గాక వివరసజ్జలచరముల్
లోసెరసినభీతిఁ బసిం, దానిఁ గనుంగొని యథాయథముగాఁ బఱచెన్.

177


క.

క్షితిజాతాగ్రస్థితలఘు, పతనకుఁ డద్దిక్కులెల్లఁ బరికించి యుప
స్థితమైనది కించిద్భయ, మతిభయ మిచ్చోటఁ గలుగదని తెలుపుటయున్.

178


వ.

హిరణ్యకమందరకులు బహిర్నిర్గమనం బొనర్చి వెగడుపడియున్నమృగంబు నూఱ
డించి యాతిథ్యం బొనరించి చిత్రాంగదుం డనునామం బిడి ముఖ్యసఖ్యంబున నల
రించి భీతికి హేతు వెద్ది చెప్పమని యడిగిన నది మృగయుత్రస్తం బని చెప్పె నమ్ము
వ్వురు నతం డొక్కరుండునుం గూడ నలువురై యన్యోన్యస్నేహవ్యామోహంబునఁ
గొంతకాలంబు గడిపి రట నొక్కనాఁడు.

179


సీ.

ఆహారవాంఛఁ జిత్రాంగదుఁ డడవికి బఱచి యొండొకకుంటఁబడియచోట
నలఘుసధీవరయంత్రవాగురఁ దగుల్కొని భీతి నంగము ల్వడఁక గోడు
గుడుచుచుఁ దోనీడ్చుకొనుచు శుష్యద్గ్రీవమై వచ్చుచుండ వృక్షాగ్రవర్తి
యగుచు దూరమున వాయసనాథుఁ డచ్చెట్టఁ గని స్రుక్కి యెటువంటికష్ట మొదవె


తే.

నేమి సేయుదు ననుచు నహీనవేగ, కలన ఱెక్కల పటపటాత్కార మెసఁగ
నరిగి బాష్పనిరుద్ధాక్షుఁ డగుచు సఖునిఁ, గదిసి యిట్లనుఁ గంఠగాద్గద్య మడర.

180


మ.

చెలికాఁడా పదబంధ మేవలన వచ్చెం జెప్పుమా నివ్వెఱం
గలఁగె న్మానస మన్న నాతఁ డను బల్కం దాల్మి లే దెంతయుం
దెలియం జెప్పెదఁ బిమ్మటం బ్రతుకుఁ గంటేఁ గ్రమ్మఱం బోయి ని
రృహృద్దాము హిరణ్యకుం బిలిచి తెమ్మా బంధవిచ్ఛిత్తికిన్.

181