పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మనుపఁ బ్రియంబయేనిఁ జనుమా యన నాయన నిర్భరత్వరం
జని నిరవద్యహృద్యగుణసారు హిరణ్యకుఁ జేరి చూచితే
చెనఁటివిధాతచేత మునుఁ జిత్రమృగాగ్రణి కృత్తివాగురా
భిని హతపాదుఁ డయ్యె నినుఁ బిల్వఁగవచ్చితిఁ దత్ప్రశాంతికిన్.

182


క.

నావిని మూషకపతి దుః, ఖావేశితహృదయుఁడై సఖా పోవలయుం
బోవలయు జాగు సేయక, వేవేగ నన్నుఁ జేర్పవే నీ వచటన్.

183


వ.

అని పలికిన నతని మృదురీతిం గఱుచుకొని చని వాయసకులవల్లభుండు నికటం
బున నిలిచిన రుగ్ణునకు నౌషధంబును దృషితున కుదకంబును క్షుధార్తునకు మృష్టా
న్నంబును నగాధజలపతితునకు నోడయు దరిద్రునకు నిధానంబునుంబోలె నుప
స్థితుం డైన హిరణ్యకుం జూచి చిత్రాంగదుం డిట్లనియె.

184


క.

మృగయుభయంబునఁ జీకా, కగుచున్నది మది భుజంగమాకృతిఁ గాలం
దగిలినయురి గొఱికి భయా, ధ్వగచిత్రగ్రీవుఁబోలెఁ దగు ననుఁ బ్రోవన్.

185


క.

మందరకుండును గరటపు, రందరుఁడును నేను నీపరామర్శ న్మే
లందెదమని తలపోయుదు, మం దెక్కడిశంక నీదయకుఁ బాత్రంబున్.

186


క.

విచ్చలవిడి వాగురికుఁడు, వచ్చినఁ బ్రాణములమీఁద వచ్చును గృప నేఁ
డిచ్చెట్ట మాన్పు మనవుడు, నచ్చకితునిఁ జూచి మూషకాగ్రణి పలికెన్.

187


కె.

వెఱవకు వాగుర దునియం, గొఱుకుట యన నెంత నీతికోవిద నీ కే
తెఱఁగున నీదుర్దశ దెప్పరమై చనుదెంచెఁ దేటపడఁ జెప్పవనా.

188


క.

అనిన నిది నేఁడ కా దట, మును గలదన నతనిఁ జూచి మూషకరా జో
యనఘా నీతొలుతటికథ, విన నిష్టంబయ్యెఁ తెలుపవే నా కనుడున్.

189


ఉ.

రంగదుపాయపారగు హిరణ్యకుఁ గన్గొని యొప్పఁ బల్కెఁ జి
త్రాంగదుఁ డిత్తెఱంగుఁ దెలియ న్విను మాఱవమాస మేగుచుం
డంగ సుగందనై జననిడాఁపునఁ బర్వి యఖర్వపర్వత
ప్రాంగణశాడ్వలస్థటలఁ బచ్చిక మచ్చిక మేయ నాయెడన్.

190


చ.

నరనుతకీర్తియౌత్కలమునాఁ గటకంబునఁ బుష్కరుండు భా
స్కరకులుఁ డొక్కనాఁడు తెలిగన్నులయన్ను లొయారమొప్పఁ జా
మరము లిడంగ దివ్యమణిమంటపమధ్యమృగేంద్రపీఠి నం
బురుహవిరోధి పూర్వగిరిఁబోలె రహిం గొలువుండె నుండఁగన్.

191


మ.

తుటుమై యొక్కటఁ గూడి గూడెపుఁగిరాతు ల్నేను వీక్షింపఁగా
నటకాలోన హుటాహుటిం బఱచి పచ్చాకుల్ దృషత్పూనము