పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మతిమంతులు దమకార్య
స్థితు లొనరింపంగఁ జింత సేయుదు రభ్యా
గతజల మానెడుమనుజుం
డతితృష్ణాభరముఁ దొరయ నరయనిభంగిన్.

557


వ.

అని యిట్లు కరటకుండు పలుక దమనకుం డిట్లనియె మనస్వామి సంజీవకునిం జంపిన
తెఱం గెఱుంగవలయుఁ బోద మని యయ్యిరువురుఁ గదియం జనునప్పుడు పింగళకుం
డటమున్న సంజీవకుం దెగటార్చి పశ్చాత్తాపంబునం బొరలుచుండి యప్పుడు దమన
కుం జూచి చూచితే యని పలికి యిట్లనియె.

558


శా.

పాలింపం దగువానిఁగాఁ దలఁచి తాఁ బాలించి రాజార్హసు
శ్రీలం బ్రోదిగఁ జేసి పెంచుటయ ధాత్రీపాలధర్మంబు గా
కేలా యిట్లు విచారదూరమతి నై యేఁ ద్రుంచితిన్ వాని దు
శ్శీలుండై విషవృక్ష మైన నిడి తా ఛేదించునే యెవ్వఁడున్.

559


వ.

అదియునుంగాక.

560


చ.

అవగుణి యైనఁ కాక సుగుణాత్మకుఁ డైన భటోత్తము న్మహీ
ధవుఁడు పరిత్యజింప మఱి తక్కినవారు తొలంగిపోదు ర
య్యవినయవృత్తి భూపతికి హానియు ధాత్రికి నాకులంబు నై
భువి నపకీర్తి పుట్టుఁ దలపోసి తలంకెద నేమి సేయుదున్.

561


వ.

అనిన విని దమనకుండు దేవా వైరిసంహరణానంతరంబున నిట్లు సంతాపింపం బని లే
దు విను మని యిట్లనియె.

562


ఉ.

సమ్మద మొప్ప వైరిజనసంహరణం బొనరించెనేని శో
కమ్మును బొంద నేల ఘనగర్వమునన్ బ్రతికూలవృత్తిగాఁ
దమ్ములు భృత్యులున్ హితవితానముఁ బుత్త్రులుఁ గూడ కుండినన్
గ్రమ్మఱ నాజ్ఞ సేయఁ దగుఁ గాదె నృపాలుర కివ్వసుంధరన్.

563


సీ.

సార్వకాలికకృపాసంపూర్ణమతి యైన, మానవేశ్వరునకుఁ గానిగుణము
కుటిలవిచారసంఘటితమిత్త్రుం డైన, వాని భావించినఁ గానిగుణము
సమధికప్రియమున సర్వభక్షకుఁ డైన, భూనిలింపున కది కానిగుణము