పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రాణేశసంతతప్రతికూల యగునేని, మానినీమణి కది కానిగుణము


గీ.

తివిరి సచివుండు రాజ్యంబుఁ దీర్చునపుడు
కడుఁ బ్రమత్తత పొందుట కానిగుణము
చెనసి భృత్యుండు నృపుపంపు సేయ కుండు
క్రమము గలిగిన నదియును గానిగుణము.

564


చ.

అరయ మనుష్యమాత్రులకు నంటినకొంచెపుబుద్ధి ధారుణీ
శ్వరుఁడు ధరిత్రి యేలు టది వర్ణన కెక్కునె శత్రుభీకర
స్ఫురదురుకార్యఖడ్గముల భూతల మంతయు నాక్రమించి సు
స్థిరఘనకీర్తిసంపదలఁ జెన్ను వహించినఁ గాక మేదినిన్.

565


వ.

అని మఱియును.

566


సీ.

సత్యంబు దప్పక జరపు నొక్కొకచోట, ననృతంబు లొకచోట నడరఁ జేయు
సరసంపుఁబ్రియములు సలుపు నొక్కొకచోటఁ, బరుషంబు లొకచోటఁ బల్కఁ జేయుఁ
బరమకారుణ్యస్వభావ యౌ నొకచోట, నొకచోట హింసకు నుత్సహించు
నర్థార్జనాతిసమర్థ యౌ యొకచోట, నుచితదానాఢ్య యౌ నొక్కచోట
నిత్యవ్యయంబులు నెఱపు నొక్కొకచోట, నొడగూర్చు బహుధన మొక్కచోట


గీ.

నమర నృపనీతి పెక్కురూపములు గలిగి
చతురవారాంగనయుఁబోలె జగతి మెఱయు
నిట్టినయమార్గములు నీవు నెఱిఁగి నడువు
ఘనతరైశ్వర్యసంసిద్ధి గలుగు నీకు.

567


వ.

అని యిట్లు దమనకుండు పలికినఁ గలంక దేఱినచిత్తంబునం బ్రియం బంది నిజ
భృత్యామాత్యవర్గంబులం గూడుకొని పూర్వప్రకారంబునం బూజ్యసామ్రాజ్యంబు
సేయుచుండె నని విష్ణుశర్మ నృపకుమారులకుం జెప్పినమిత్త్రభేదంబు విని యటమీఁద
సుహృల్లాభంబు తెఱం గెఱింగింపు మనుటయు.

568


శా.

భామానూతనపుష్పబాణ కరుణాపారీణ విద్వజ్జన
స్తోమారామవసంత వైరిజనతాశుండాలహర్యక్ష ది
క్సీమాలంఘనసాంద్రకీర్తిలతికాకీర్ణప్రభావోదయా
సామోచ్చారణభుక్తిముక్తిఫలదా నమ్రైకరక్షామణీ.

569