పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సమ్ముఖంబునకుం బోవుద మని కదలునంతం గథనకుఁడుం గూడుకొన్న నన్నలువురుం
జని సింహంబుబహిర్ద్వారంబునఁ గథనకుని నిలిపి మువ్వురుం జని మదోత్కటునకుం
బ్రణమిల్లి యిట్లనిరి.

386


గీ.

అధిప గిరిగహ్వరముల కుగ్రాటవులకు, నరిగి యామిష మబ్బక తిరిగి తిరిగి
చిక్కితిమి నీవు చిక్కి నశింప నేల, విన్నవించెద మే మొకవెరవు వినుము.

387


గీ.

కథనకుండు మిమ్ముఁ గార్యార్థియై వచ్చి, కొలిచినాఁడు గాని నిలువలేదు
వాఁడు నీకు మాకు వలయుభోజన మగుఁ, బ్రియము వదలి మట్టుపెట్టితేని.

388


వ.

అని కాకంబు పలికిన విని మృగేంద్రుండు కర్ణస్పర్శపూర్వకంబుగా హరిస్మర
ణంబు సేయుచు నభయవాక్యంబు లొసంగి కొలిపించుకొని యిట్లు సేయం దగునే
విను మని యిట్లనియె.

389


మ.

ధనదానంబును నన్నదానమును గోదానంబు భూదానమున్
విను మిట్లీయభయప్రదానమునకు న్నిక్కంబు తుల్యంబు లౌ
ననరా దీయెడ నశ్వమేధమఘపుణ్యంబు భయభ్రాంతుఁ గా
చినపుణ్యంబునఁ బోల దంచు సుజనుల్ చెప్పంగ వింటిం దగన్.

390


వ.

అనినఁ గాకం బిట్లనియె.

391


గీ.

కులముకొఱకు విడుచుఁ గొఱగాని పుత్రునిఁ, గులము విడుచు నూరు నిలుపుకొఱకు
భూమికొఱకు విడుచు బోరన గ్రామంబు, ధాత్రి విడుచు నృపుఁడు తనకుఁగాను.

392


వ.

కావున మే మందఱముం గలిగియుఁ బ్రయోజనంబు లేదు సకలజంతురక్షకుండ వగు
నీశరీరంబు నిలిచినం జాలు నాదేహం బీపూఁట కాహారంబు సేయ నవధరింపు మని
వాయసంబు పలికిన విని మృగపతి యూరకున్న యెడ లబ్ధవకాశులై తక్కిన
మువ్వురుం గూడుకొని యతనిముందఱ నిలిచి యుండ వాయసంబు మఱియు నిట్లనియె.

393


గీ.

తప్పఁ జూచి నన్ను మెప్పింపఁజాలవు, చాలకున్న నేన చత్తు నాశ
రీరమాంస మిపుడు ప్రియమున భక్షింపు, మనఘ నాకు దీన నగు ముదంబు.

394


వ.

అనినం గాకంబునకు సింహం బిట్లనియె.

395


గీ.

అల్పమాంస మిందు నాప్యాయనము గాదు, వట్టిహింస నాకుఁ గట్ట నేల
యనిన నాలకించి యమ్మగేంద్రునితోడ, జంబుకంబు పలి'కె సామ్యఫణితి.

396


క.

నాదేహము నీ కిచ్చితిఁ, గా దనక భుజింపు స్యామి కార్యము సేయం
బ్రోది గలనాకు నిదె నీ, పాదంబులె దిక్కు సూవె పరమార్థముగన్.

397


వ.

అనిన విని మదోత్కటుండు కాకంబుతోడఁ బల్కినట్ల యమ్మృగధూర్తంబునకుం
బ్రత్యుత్తరం బిచ్చినఁ బులి కదియం జనుదెంచి సాష్టాంగనమస్కారంబు చేసి వినయ