పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మీకుఁ దగినయాహారంబు మేము దెచ్చి, ప్రీతి నొకపూఁట కైనను బెట్టలేము
చాల నల్పుల మగుట మాచంద మట్టి, దనిన మృగరాజు వారితో ననియె నపుడు.

373


క.

ఏపాటియశన మబ్బిన, నాపాటిం బ్రొద్దు గడపి యట్లుండెద నా
కీపాపపుఁదెవు లొదవెం, జూపోపక దైవ మిట్లు సొం పడఁగించెన్.

374


వ.

అట్లు గావున.

375


క.

వడిఁ బోయి మీర లిప్పటి, కడిదికి నేమాంస మైన గ్రక్కునఁ గొనిరం
డెడ సేయ కనుచుఁ బనిచినఁ, గడు వడి నలువురును బోయి గహనములోనన్.

376


గీ.

పొదలు సొచ్చి చూచి పుట్టలు వీక్షించి, చెట్టు గుట్ట మొదలు చేరి కాంచి
గిరులు నదులుఁ దొనలు బరికించి పరికించి, కాన నొకమృగంబుఁ గానలేక.

377


వ.

కాకవ్యాఘ్రగోమాయూష్ట్రంబులు నలుదిక్కులం జెదరి వెదకం బోయి కథన
కుండు వెలిగా నొక్కచో మువ్వురుఁ గూడుకొన్న సమయంబునఁ గాకం బిట్లనియె.

378


గీ.

స్వామిపని పూని వచ్చినచందమునకు, నడవిలోపల నేమియు నబ్బదయ్యెఁ
గంటకాహారుఁ డైనయాకథనకాఖ్యు, నతని కాహారముగఁ జేయ ననువు గాదె.

379


వ.

తచ్ఛేషంబును మనకుఁ గొన్నిదినంబు లుదరపోషణంబునకుఁ జాలు గతకాలంబున ననే
కమృగమాంసంబుల మనలఁ బోషించిన రాజున కీసంకటంబుఁ బాపం దగదే యనినఁ
గాకంబునకు నవి యిట్లనియె.

380


గీ.

అభయ మిచ్చి కరుణ నందఱకంటెను, విభవ మిచ్చినట్టి విభుని మొరఁగి
మనము వీనిఁ జంప మది నెఱింగినయేని, నాగ్రహించి మనల నాజ్ఞ చేయు.

381


క.

పేరెఱుకమాత్ర నధిపతి, చేరువ నంతంతఁ దిరుగుచిఱుతని నైనం
గారించెనేని సచివుని, భూరమణుఁడు గినియు వీనిఁ బొసఁగునె చంపన్.

382


వ.

కావున మనస్వామి యెఱుంగకయుండ నతనిఁ జంపుట కార్యంబు గా దనినఁ
బుండరీకజంబుకంబులకుఁ గాకం బిట్లనియె.

383


గీ.

చావు తథ్యంబు మనకు విచార మేల, పెక్కు దివసంబు లాఁకటి పెల్లుకుడుచు
హరికి నెచ్చోట నేమియు దొరకదయ్యె, నరయ నింతకు దైవికం బట్ల కాదె.

384


మది నధికక్షుధార్తుఁ డగుమానవుఁ డాలిని బిడ్డ నొల్లఁ డిం
పు దనర సర్పముం దనకుఁ బుట్టినయండములన్ భుజించు నొ
ప్పు దఱిగినట్టిచోటను బుభుక్షితుఁ డై దురితంబు చేయఁగా
మదిఁ దలపోయకుండునె ప్రమాదము పుట్టుఁ దొలంగిపోదమా.

385


వ.

అనినఁ గాకంబునకు శార్దూలం బిట్లనియె మనస్వామి మహావ్యాధిపీడితుండును
బుభుక్షితుండును నై యున్నయెడఁ దొలంగిపోవుట భృత్యన్యాయంబు గా దతని