పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అతులమహోగ్రకాననమునందు మదోద్కటనామసింహ ము
ద్ధతిఁ జరియించు దానికిఁ బ్రధానులు కాకము పుండరీకమున్
మతిగలజంబుకంబును గ్రమంబునఁ బం పొనరింపుచుండి యొ
క్కతఱి నరణ్యదేశమునఁ గాంచిరి యుష్ట్రము నిండువేడుకన్.

363


మ.

కని నీ వెచ్చటనుండి వచ్చి తనినం గాకాదిజంతుత్రయం
బునకున్ వందన మాచరించి యనియెన్ మున్ సార్ధవాహుండు వీఁ
పున మోపింపఁగ మోసి డస్సి యెచటం బోలేక దాగున్నవాఁ
డను మీ రేగతి నన్నుఁ బ్రోచినను వేడ్క న్నిల్తు మీచేరికన్.

364


వ.

అని పలికినయుష్ట్రంబునకు జంబుకం బిట్లనియె.

365


క.

ఈకాన నొకమృగేంద్రుఁడు, చేకొని సామ్రాజ్యపదవిఁ జెన్ను వహించున్
మా కతఁడు కులస్వామిగఁ, గైకొని సేవింతు మెల్లకాలము కడఁకన్.

366


క.

నీవును మాలో నొకఁడవు, గావున మృగరాజుసమ్ముఖంబున నిడి నే
నీవిధముఁ దెలియఁ బలికి శు, భావహ మగుభంగి నీకు ననుసంధింతున్.

367


చ.

వెఱవక విశ్వసింపు మము వింతగఁ జూడగఁ వచ్చితేని ని
న్నెఱుకపడన్ మృగేంద్రునకు నింపుగఁ జెప్పి తదీయభ క్తికిన్
గుఱుతుగ నిన్నుఁ జేసి మనకోరిక లెల్ల నతండు దీర్పఁగా
నెఱసినవేడ్క నల్వురము నెమ్మది నుండుద మెల్లకాలమున్.

368


క.

అనుటయు నాలొట్టియయును, దనమది ముద్ద మంది వెంటఁ దగిలిన వానిం
గొని చని మృగపతిముందట, వినయముతో నతని తెఱఁగు వినిపించుటయున్.

369


వ.

ఆమృగేంద్రుండును నయ్యుష్ట్రంబు నభయవాక్యంబులఁ బ్రమోదం బెసంగం జేసి
కథనకనామధేయం బిడి నాపూర్వామాత్యులలో నీ వొకండవై యుండు మని నియ
మించిన గోమాయుపుండరీకకాకంబులం గలిసి యతిస్నేహంబునఁ బెద్దకాలం బున్న
సమయంబున నొక్కనాఁడు మదోత్కటుండు కాకవ్యాఘ్రగోమాయూష్ట్రం
బులం గనుంగొని యిట్లనియె.

370


ఉ.

కల్యమునందు భక్ష్యమును గానక మేను కృశించె రోగదౌ
ర్బల్యము నాకుఁ గల్గుటను భద్రగజేంద్రశిరఃపలాదబా
హుల్యము లేమి నుద్ధతికి నోపక చిక్కితిఁ గాన దేహవై
కల్యము మానుకైవడి సుఖం బగుపథ్యముఁ దెచ్చి పెట్టుఁడీ.

371


వ.

అని పలికిన మృగేంద్రునకు నన్నలువురు నేకవాక్యంబుగా నిట్లనిరి.

372