పుట:నృసింహపురాణము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

నృసింహపురాణము


ఉ.

భాసురభానుభానునిభభావిభవున్ గరుడాద్రిదివ్యసిం
హాసను నన్ను నున్నతదయార్ద్రు నహోబలతీర్థనాథు ల
క్ష్మీసముపేతుఁ జారునరసింహశరీరు భజించునుత్తముల్
వే సకలార్థసార్థసుఖవీధుల గ్రాలుదు రెల్లకాలమున్.

163


వ.

మఱియు నీయహోబలంబు సమస్తతీర్థసారంబు గావున నిందలితీర్థంబుల వివరింపనుం
దత్ఫలంబు భూషింపనుం బహుతరంబైన కాలంబువలయుఁ గృతత్రేతాద్వాపరకలి
యుగంబుల నిమ్మహాతీర్థంబుమీఁదఁ దాత్పర్యంబు లేక నన్ను గొల్వక యథేష్టచరితుల
గుదురు భాగ్యంబున నెవ్వరేని యిచ్చటికి వచ్చి భయభక్తివిశ్వాసంబులతో మదీయ
సేవాసక్తులయినవారలు సకలమనోరథంబులు సఫలంబులుంగాఁ గని దివిజులకుం బడ
యరానియస్మదీయలోకాభిగమనంబుఁ బడయుదురు. యిది పరమరహస్యంబు త్రైలో
క్యహితార్థంబుగా నెఱింగించితి నని వెండియు నిట్లనియె.

164


క.

విను కలియుగమున మానవు, లనయము నాస్తికులు దృష్టమైనది దెలియం
గనుగొనియు నమ్మతని యే, నొనరించితిఁ బ్రత్యయంబు లొకకొన్ని గృపన్.

165


సీ.

సంతానకాంక్షులై యెంతయుఁ జింతిల్లు కాంతలు పురుషులు గలిగి కేని
చేరి జయార్థులై బీరంబు మిగులంగఁ గడఁగెడురాజులు గలిగిరేని
యధికరోగార్తులై యారోగ్యసంసిద్ధి గావింప వెజ్జులు గలిగిరేని
బహువిపన్మగ్నులై పారంబు గానక కలఁగెడుదీనులు గలిగిరేని


ఆ.

వారు వారు వారు వారును భక్తియు, నమ్మికయును నెమ్మనముల మిగుల
నను నహోబలేశు నరసింహదేవునిఁ, గొలిచి కాంతు రెల్లకోరికలను.

166


క.

కన్నులు జాత్యంధునకున్, గన్నియకును జారుభర్త గర్భిణికి సుతుం
డున్నతవిద్య విమూఢున, కు న్నిజముగ నమ్మి నన్ను కొలిచిన నొదవున్.

167


క.

నరహరి యహోబలేశ్వర, శరణం బగుమనుచుఁ బలుక సర్వావస్థాం
తరముల నెప్పుడు నతనికిఁ, గరస్థలము భుక్తిముక్తికళ్యాణంబుల్.

168


సీ.

క్షీరాబ్ధిభవనంబు శ్రీపురుషో త్తమం బాదికేశవ మనంతాలయంబు
శ్రీకాంచిపురి హరిక్షేత్రంబు మధుర శ్రీద్వారక శ్రీరంగభూరిపదము
శ్రీకూర్మసదనంబు సింహాచలంబును నాదివరాహసమాశ్రయంబు
మాధనాఖ్యంబు గదాధరనిలయంబు బదరీనే వనము శార్ఙ్గపాణిగృహము


ఆ.

మొదలుగాఁ ద్రిలోకవిదితంబు లగుమహా, స్థానములును సుజనసంస్తవములు
నొప్పుఁ గాని నాకహోబలతీర్థంబు, పగిది నధికవల్లభములు గావు.

169


ఉ.

ఏదివసంబునందయిన నెమ్మెయినైనను నెవ్వఁడైన న
త్యాదరవృత్తి భక్తిమతియై చనుదెంచి యహోబలేశు న