పుట:నృసింహపురాణము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

101


న్నాదిమదైవతంబుఁ గనినట్టి మహాత్ముఁడు సిద్ధసౌఖ్యస
మ్మోదము నొందు నెంతయు నమోఘము నాపలు కంబుజాసనా.

170


వ.

విశేషించి మద్భక్తజనంబులును వసంతమహోత్సవంబు మిగులం బాటించి కొలువంగో
రునప్పు డేను బ్రసన్నుండనై సేవకు మనోరథార్థంబులు నెరపుదు. నమరాసురసంయ
మిసిద్ధసాధ్యగంధర్వాదులు దమయిష్టసిద్ధ్యర్థంబు వసంతయాత్రాప్రసంగంబునం జను
దెంచి నన్ను నారాధించెద. రాసమయంబున మర్త్యులమర్త్యులను భేదంబు దోఁపక స
ర్వంబును దేవతామయం బయ్యు నిప్పటిమహోత్సవం బిట్లొప్పినయట్ల వసంతో
త్సవంబు నాకు మనఃప్రియంబై యుండు.

171


చ.

అమరవసంతయాత్ర నఖిలావనిమండలిమధ్యవాసులున్
దమతమకల్మి భూజను లుదాత్తవిభూషణపత్రగంధమా
ల్యములు నొనర్చువారలును వాయనసంచయ మిచ్చువారు నై
ప్రమదముతో నొనర్తురు కృపానిధి నన్ను నహోబలేశ్వరున్.

172


ఉ.

అట్టివసంతయాత్రఁ గొనియాడినవానిని రిత్త నెన్నడున్
బుట్టువు చావు నొందని ప్రభుత్వము వైష్ణవరాజ్యలీలకున్
గట్టుదుఁ బట్ట ముజ్వలవికాసకృపాకమనీయబుద్ధిమైఁ
జుట్టలు వీరు నాకు నని చూతుఁ దిరంబుగఁ నేను వారలన్.

173


ఆ.

హేమరత్నరజతభూమికన్యాదిక, దానములును సద్వ్రతక్రియలును
నొకటి కొకటి ఫలము నొసఁగు నహోబల, తీర్థమున నొనర్చు ధీనిధులకు.

174


క.

తపములు పితృకార్యంబులు, నుపవాసంబులును నియ్యహోబలమున ని
క్కపుభక్తి ననుష్ఠింప న, సుపమంబగు తీర్థఫలము లొందఁగఁగలుగున్.

175


సీ.

అనవరతంబును నస్మదీయధ్యానశీలురై బుద్ధి రంజిల్లువారు
చక్రాంకతులసీవిశాలసాలగ్రామసేవ నస్మత్ప్రీతి సేయువారు
నతిభక్తి మచ్ఛరణాగతజనులను గొనియాడి వేడుకఁ దనరువారు
మామకదివ్యనామస్తోత్రసంసక్తి నానందపరత నింపారువారు


ఆ.

చేరిగొల్చువారు శ్రీమదహోబల, తీర్థనాథు దేవదేవు నన్ను
వారు భుక్తిముక్తివైభవభాగులు, వారు పుణ్యధనులు వారు ఘనులు.

176


క.

యతులును సాత్వికులును సా, త్వతులును జక్రాంకభాగవతులును నిత్య
వ్రతులు నహోబలతీర్థ, స్థితు నరసింహాత్ము నను భజింపఁగ నర్హుల్.

177


శా.

వేదార్థప్రతిపాలనైకనిపుణుల్ విప్రోత్తముల్ సత్కథా
స్వాదప్రీతులు భూపతుల్ గుణవశుల్ వైశ్యుల్ నిజాచారసం
వేదుల్ తక్కటివారునుం గలియుగావిర్భావకాలంబునన్
వేదాతీతు నహోబలేశు నను సేవింపంగఁ బాత్రుల్ మహిన్.

178