పుట:నృసింహపురాణము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

నృసింహపురాణము


సీ.

మునులతీవ్రపుశాపమునఁ జేసి మత్ప్రతిహారులు దితిసూనులై జనించి
రం దగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డభిహతుఁ డయ్యె హిరణ్యాక్షుఁ డనుజుఁ డింక
నాదివరాహరూపాస్మదీయోగ్రతేజంబుచేతన యుపశాంతిఁ బొందు
వినుము త్రేతాయుగంబున వీరరావణకుంభకర్ణాఖ్యరక్షోవరేణ్యు


తే.

లై సముద్భవ మందుదు. రపుడు నేను, నవతరించి జయింతు. మూఁడవయుగంబు
నందు శిశుపాలదంతవక్రాఖ్యఁ బుట్టి, పడయుదురు వీరు మద్భావభవ్యపదము.

147


వ.

అని యానతిచ్చి యిట్లను. నహోబలనామధేయంబున నిమ్మహాతీర్థంబు మదీయనివాసం
బై నేఁడు మొదలుగాఁ ద్రిభువనపూజనీయత్వంబునం బొగడొందు. నిప్పుడు మత్సే
వోత్సవంబునకుం జనుదెంచిన యియ్యమరగణంబును నిమ్మునిసముదయంబులును సా
గరద్వీపాదివిశేషంబులునుంగూడ నిన్నియు నిచ్చోటన నిరంతరంబును సన్నిధి చేసి
యుండునది. యిది యస్మదీయవిజ్ఞాపనంబు.

148


చ.

సకలసురైకవాసమగు సర్వమునీంద్రమయంబు విశ్వతీ
ర్థకలితమున్ సమస్తసుకృతప్రభవంబును నై త్రిలోకదీ
పకమగు నీయహోబలము భక్తి యెలర్ప భజించునంచితా
త్మకులకు నెల్లతీర్థములుఁ దథ్యముగా సమకూరు నెప్పుడున్.

149


సీ.

విషువద్దినముల రవిగ్రహసోమగ్రహణములఁ బున్నమ నమపవసలను
హరిదివసముల జయంతి బారసి వెండియును బేరుకలపుణ్యయుక్తతిథుల
భక్తి నేతెంచి యీభవనాశినీనుహానదిలోన నభిషేచనంబు సల్పి
గరుడాద్రీకందగ రస్థిరమందిరంబునఁ బొలుపొరునన్నహోబలపురీశుఁ


ఆ.

గొలుచువారు పుణ్యములకెల్లఁ గుదురైన , వారు నన్ను నెపుడు వలచువారు
వలతు నెపుడు నేను వారిశికి వారికి, నేనొనర్చు టరయ రెట్టివారు.

150


మ.

భవరోగంబుల కౌషధంబు భవపాపజ్వాలకున్ వైరి దు
ర్భవపంకప్రవిశోధనంబు భవభావస్ఫారతృష్ణాహరం
బవిరోధం బకలంక మక్షయరసోదాత్తంబు భక్తప్రియో
త్సవ మెందున్ భవనాశినీజలము నిత్యస్తుత్య మిమ్మేదినిన్.

151


క.

భవనాశిని భవనాశిని భవనాశిని యనుచుఁ బలుకు భక్తజనులకున్
భవనాశిని భవనాశిని, యవుటకు భువియందు సందియంబును గలదే.

152


ఉ.

నాకరుణారసంబు భవనాశిని నా నవినాశనాకృతిన్
శ్రీకరవాహినీతనుజఁ జేకొని నాకమనుష్యలోకద
ర్వీకరగేహగాహితపవిత్రగుణౌఘమునన్ మహాజన
శ్లోకితయై తనర్చు నతిలోకవిలోకసుపాకభవ్యతన్.

153