పుట:నృసింహపురాణము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

83


శ్శంకతఁ గాలపాశములఁ గేల నమర్చి మహోగ్రమూర్తియై
బింక మెలర్ప డాసెఁ బటుభీషణమర్త్యపురస్సరంబుగాన్.

30


వ.

ఆ సమయంబున నార్తశరణ్యుండగుగరుడధ్వజుండు పనుపఁ దదీయసేనాధిపతి విష్వ
క్సేనుండు కింకరకోటియున్ దానును దివ్యహయధట్టంబులతో దాడివెట్టి బిట్టఱఁ గృ
తాంతకింకరుల ముట్టి కనుపుగొట్టం దొడంగినం గని దైత్యపతి తానును భయభ్రాం
తుఁడై డిగ్గి తొలంగి యభ్యంతరగృహంబునకుం బఱచి వెఱవచఱచి సందులు బ్రిందులు
గొందులు దూఱియుండె. నాలోన.

31


మ.

ఖరఘోటాగ్ర ఖురాపపాతనిహతిన్ ఖండంబులై యాశ్విక
స్ఫురదుద్దామకృపాణకుంతముఖవిస్ఫోటంబులన్ వ్రస్సి భీ
కరసేనాపతిచక్రధారఁ దుమురై గర్వోల్లసత్కాలకిం
కరసైన్యంబులు వ్రేల్మిడిన్ బొలిసె నుత్కంపింప ద్రైలోక్యముల్.

32


క.

అంతఁ బరమాత్ముకింకరు, లంతం బట్టుకొని యోరి హరిదాసుల ని
ర్జింతునని పూనఁగా నీ, వెంతటివాఁడ విటఁ గుడువు మీఫల మనుచున్.

33


క.

మొగమును ముక్కును జడయఁగ,, బిగువగుపిడికిళ్లఁ బొడువ బెగడి జముండున్
సుగుణాకర ప్రహ్లాదుఁడు, విగతభయుఁడ నన్నుఁ గావవే కృప ననఁగన్.

34


ఆ.

అమ్మహానుభావుఁ డమ్మహావీరుల, ననునయించి వీఁడు ననపరాధుఁ
డీకృతాంతు విడువుఁ డితఁ డపరాధీనుఁ, డేమి చేయు సుజనుఁ డీసులేదు.

35


వ.

అనిన నట్లుకాక యని యంతట విడిచి యసురాంతకభృత్యులు దైత్యపతి మున్నుతల
యుంజీరయు విడనాడి పాఱుటఁ జూచినవారు గావున వాఁడు నరసింహనఖంబుల
కెర గాఁగలవాఁడని నిశ్చయించినవారై యేమియుం జేయనొల్లక యాదితిసూనుపురం
బుఁ గాల్చి దైత్యులఁ గొందఱబారి సమరి సమదగమనంబునం జనిరి. ప్రహ్లాదుండును
దండ్రికడకుఁ జని యి ట్లనియె.

36


మ.

సకలేశుం డగువిష్ణుసైన్యపతి విష్వక్సేనుఁ డీవీరుఁ డె
న్నికకున్ బెక్కుబలంబు లీతనికి వర్ణింపంగ శక్యంబె యి
ట్లొకఁ డేతెంచిన బొల్లరాఁ బొలిసె నీయుద్దామదర్పంబు దా
న కడంకన్ హరివచ్చినం జెపుమ నిన్ గానంగ నిందొక్కనిన్.

37


వ.

ఇది దృష్టంబుగాఁ గన్గొని.

38


ఉ.

వెన్నఁటి యింకనుం జెడక శ్రీరమణీకుచకుంకుమచ్ఛట్యా
చ్ఛన్నశరీరు నుద్యదసిశంఖుసుదర్శనహస్తుఁ గౌస్తుభో
ద్భిన్నగభస్తివిస్తరణదీప్తభుజాంతరు నంతరంగసం
పన్నదయాంతరంగు హరి భక్తవిధేయు భజింపు మింపునన్.

39


క.

క్షోదంబుల భేదంబుల, వాదంబుల ద్రోపు లేదు వనజాక్షుమహ