పుట:నృసింహపురాణము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

నృసింహపురాణము


గలహంసీహసితానులాపములు నై గంభీరపద్మాకరం
బుల కోకద్వయసంగమోత్సవములం బొల్పారెఁ గాల్యంబులై.

114


వ.

అంత.

115


మ.

అనితరకాంతిఁ బద్మినిఁబ్రియాతిలకంబు మొఱంగిపోయి రే
యెనసినవేడ్క నొండు దనయిచ్చమెయి న్విహరించి మేనజం
టిననవరాగలీల జిగిదేరఁగ నోడి యొదింగి యొయ్యనొ
య్యనఁ బొడచూపేనా నుదయమయ్యెఁ బతంగుఁడు బ్రాఙ్ముఖంబునన్.

116


సీ.

కమనీయదిగ్వధూకర్ణపల్లవము లాకాశకింశుకకోరకప్రతతులు
వాసరహరణవదనసింధూరముల్ వనరుహకుంకుమోద్వర్తనములు
కుముదినీనవతపరిక్రమవల్కలంబులు తిమిరాపహరణప్రదీపశిఖులు
త్రైలోక్యమందిరరత్నతోరణములు ప్రత్యూషవటరక్తపత్రకంబు


ఆ.

లనఁగ నూతనంబులై కెంపులై సొంపు, లలర మణిమరీచు లతిశయిల్ల
నఖిలభువనమంజులాంజలిపుటపూజ్య, మానుఁ డగుచు బాలభానుఁ డొప్పె.

117


వ.

ఆసమయంబున నసురేశ్వరుండు విహితదినముఖవ్యాపారుండై యంతఃపురంబు వెలు
వడి యాస్థానభవనంబునకు వచ్చి సకలసురరిపుప్రకరంబులు పరివేష్టింప నభీష్టచేష్టి
తంబులన్ వర్తిల్లుచున్నయెడ భృగువంశవరుండును, దైత్యవంశగురుండును, నిజమం
త్రమహిమావధీరితశక్రుండును నగు శుక్రుండును జనుదెంచి హిరణ్యకశిపుం గాంచి
యతనిచేత నభినందితుండై వివిధాశీర్వాదంబుల నమ్మహావీరు నభినందితుం జేసి తదను
మతిం దదీయజీవితేశ్వరిని దీవింప నభ్యంతరమందిరంబునకుం జనిన.

118


మ.

గురురా కప్పుడు గాంచి సంభ్రమముఁ జక్షుఃప్రీతియుం భక్తిత
త్పరభావంబును నొప్పు నప్పుడు వెసం బద్మాక్షి ప్రత్యుద్గమా
దరసంసక్తి నమస్కరించె మహితోద్యత్పీఠవిన్యాససు
స్థిరసంపూజ లొనర్చి తత్కృతశుభాశీరుక్తకల్యాణియై.

119


వ.

తత్సమీపంబున సముచితాసనంబున నుండఁ గరకమలంబులు మొగిడ్చి యమ్మహాత్మున
కిట్లనియె.

120


క.

రే యొకకలఁ గాంచితి ముని, నాయక యే నది మదీయనాయకుమది యె
ట్లై యుండఁజేయునో యని, యాయన కెఱిఁగింపనైతి నాత్మ నునిచితిన్.

121


క.

దైవము గురుఁడును బంధుఁడు, నేవిధమున మాకు మీర లీప్సితశుభస
ద్భావంబులుసతతంబును, గావింపఁగఁ గర్తలౌటఁ గవిజనవినుతా!

122


సీ.

అవధరింపుము జలదాసితవర్ణుఁడు ఘనశంఖచక్రలాంఛనభుజుండు
మహితకోమలవనమాలాసలక్షణవక్షుఁడు వికసితవారిజాక్షుఁ