మ. |
మఱునాఁ డమ్మునినాథు వీడ్కొని జగన్మాన్యత్వవిఖ్యాతికిన్
గుఱి యై యుండెడిగంగ దాఁటి మదిఁ గోర్కుల్ ప్రోవుగా వీడు డ
గ్గఱఁ బోఁబోవఁగఁ జూడ్కి యారఘువరాగారంబుపై వేడుకం
బఱచెం గ్రమ్మెడుసమ్మదాశ్రువులతోఁ బల్మాఱుఁ ద్రోపాడుచున్.
| 45
|
ఆ. |
ఇట్టు లరిగి మేదినీశ్వరుఁ గని తత్ప, దాంబుజంబు లుత్తమాంగమునకు
భూషణముగ మేను పులకలప్రోవుగాః, బ్రణతుఁ డయ్యె నానృపాలసుతుఁడు.
| 46
|
చ. |
తిగిచి కవుంగిలించి నరదేవకులోత్తముఁ డక్కుమారు నె
మ్మొగము మొగంబునం గదియ మోపుఁ గరాంగుళులం గపోల మిం
పుగఁ బుడుకుం బొరిం బొరి నపూర్వవిలోకన మాచరించుఁ గ
ప్పగుమృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్.
| 47
|
చ. |
తనుఁ గొనియాడునాతనికిఁ దమ్ముఁడు గేలు మొగిడ్చి యల్ల ని
ట్లను భవదాజ్ఞ మోచి చని యద్దనుజాధము సంగరాంగణం
బున వధియించి విప్రుల కపూర్వమహోత్సవ మాచరించి వా
రనికృప వారు పంప మధురాపురి రాజ్యము సేయుచుండితిన్.
| 48
|
క. |
మిముఁ గొలుచుసుఖమునకు రా, జ్యము సౌఖ్యం బీడు గామి నం దునికికిఁ జి
త్తము గొలుపక నావచ్చుట, సముచిత మనుచితము నాక చననిండు దయన్.
| 49
|
ఉ. |
నావుడు నల్ల నవ్వి నరనాథుల కి ట్లనఁ జెల్లు నయ్య య
చ్చో వసియించిన సరిగఁ జుట్టముఁ బాసియు నిల్వఁ జాలి నా
నావిధదేహదుగఖము మనంబున నోర్చినఁ గాక రాజ్యల
క్ష్మీవిభవంబు సొప్పడునె కేవలమే నృపతిత్వ మారయన్.
| 50
|
క. |
అని బోధించి మగుడ నే, డెనిమిది దివసములలో నరేశ్వరుఁ డటఁ బోఁ
బనిచిన నాతఁడుఁ బ్రీతిం, జని మధురాపురము రాజ్యసంపదఁ బొందెన్.
| 51
|
క. |
భూనాథుఁ డిట్లు దమ్ములుఁ, దానును వివిధప్రకారధర్మనిరతు లై
నానావిధసజ్జనస, మ్మానసదాదాననిపుణుమతి నున్నయెడన్.
| 52
|
ఒకానొకబ్రాహ్మణుఁడు చచ్చినకొడుకుం దెచ్చి రామునినగరివాకిటఁ బెట్టి దుఃఖించుట
ఉ. |
చచ్చినపుత్రు నెత్తుకొని జానపదుం డొకవిప్రుఁ డార్తుఁ డై
వచ్చి నరేంద్రుమందిరము వాకిట నాలును దాను నిల్చి వా
పుచ్చి మహోష్ణబాష్పములు బోరనఁ గ్రమ్మఁగ నేడ్చి యేడ్చి క
న్విచ్చుచు మోడ్చుచుం గోడుకు వేఁడుచు నెవ్వరి నేనిఁ జూచుచున్.
| 53
|
మ. |
తనయుం డొక్కఁడ కాని నాకు మఱి సంతానంబు లే దేను భా
మినియుం బిమ్మటిసత్క్రియల్ పడయ లేమిం జూడఁ డయ్యెం గటా
చనునే వీనికి నిట్లు సేయ మరణోత్సాహంబు శోకాపనో
దన మంచుం బలుమాట లాడుచుఁ బరీతాపంబు దీపింపఁగన్.
| 54
|