పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అతఁ డుపవిష్టుఁడై రఘుకులాగ్రణి కి ట్లను దేవ దేవి నన్
చితిని భవన్నిరూపితవిశిష్టతపోవనభూమికిం దగ
న్పతి మునియాజ్ఞ నాశ్రమమునన్ వసియించె జరత్తపస్వినీ
యుతనవపర్ణశాల నఖిలోపనతార్ఘ్యసగౌరవంబుగన్.

72


క.

అని తననిర్వర్తించిన, పని విజ్ఞాపనము సేసి పతితో నతఁ డి
ట్లను మఱియుఁ దన్మనోవే, దన మాన్పుతలంపునను హితము సత్యము గాన్.

73

లక్ష్మణుఁడు రామునకు దుఃఖోపశమంబు సేయుట

ఉ.

ఇట్టివి దైవచేష్టితము లెవ్వరికిం గడవంగ రాదు మీ
యట్టిమహాత్ము లుమ్మలిక లందినచో ధృతి గట్టి చేసి లో
గిట్టక యుండ గీడ్పఱిచి గెల్వక తక్కిన నిర్వహించు పెం
పెట్టొకొ బుద్ధిమంతులకు నెక్కుడుభంగిఁ దలంచి చూడఁగన్.

74


క.

పెరుఁగుట స్రగ్గగఁ జవులం, బొరయుట యవశంబు గాఁగఁ బుట్టుట చావన్
బెరయుట పాయఁ బదార్థో, త్కరముల నైజ మిది యెట్లు దప్పింప నగున్.

75


ఉ.

కావున దారపుత్త్రసఖికామదముం బితృమాతృసోదరా
శావలనంబు గాఢముగ సల్పుదురే మిము బోఁటు లైనసం
భావితు లట్లు గాక నిరపాయము లై కడచన్నవానికిం
బోవునె పెద్దవారితలఁపుల్ మును వేడుక యెంత కల్గినన్.

76


మ.

జనవాదంబునకుఁ బ్రియం దొఱఁగ నుత్సాహంబు సేయంగ వ
చ్చునె యి ట్లేవ్వరి కివ్విధంబు దలఁపం జోద్యంబు గాదే క్రమం
బున నిష్కల్మషవృత్తముల్ దెలియ నోపున్ లోక మెబ్భంగి నీ
మనువంశంబు భవద్గుణంబుల జగన్మాన్యత్వముం బొందెడున్.

77


శా.

తాపంబుం బెడఁబాపి దుర్దమవిషాదంబుం దిగం ద్రావి ని
ర్వ్యాపారత్వముఁ బోవఁ ద్రోచి వగ లుద్వాపించి వెల్వెల్లఁబా
టేపొంతన్ మెలఁగంగ నీక మదికం దెల్లం దెగం బుచ్చఁగా
నీపెం పార్యజనంబు మెచ్చు ధృతి కున్మేషంబు గావింపవే.

78


క.

అనవుడుఁ దమ్మునిమాటలు, విని సంభావించి యీవివేకవచనముల్
సను నీకు నిట్లు సెప్పఁగ, నని విభుఁ డుల్లంబు కలఁక యంతయుఁ దీఱన్.

79

రాముఁడు దుఃఖము నడఁచుకొని ప్రజలం బాలించుట

క.

నీ పంచినట్ల చేసెద, భూపతులకు ననవధానమునఁ బుట్టు ననే
కాపదలు వినుము తొంటిమ, హాపురుషుల నని వినీతుఁ డగునాతనితోన్.

80


క.

నృగుఁ డనఁగ నిమి యనం జను, జగతీపతు లనవధానజాడ్యంబున నిం
దగతిం బొందినతెఱఁ గా, సగరకులోద్వహుఁడు సెప్పెఁ జతురత మెఱయన్.

81