సంచిక 1
నారసింహపురాణము- ఉపోద్ఘాతము
29
దయమును గృతిపొందిన నంద్యాల కృష్ణమరాజు. కనుక నీకృష్ణమరాజునకు ఆవళి చినౌబళుఁడు పెదతాతమనుమఁ డన్నమాట. మఱియు నీ నంద్యాలవంశమున నింకొక చిన్నయహోబళుడును, గుమారౌబళుఁడును, చిన్నయోబళుఁడును, ఓబయ్యయు, ఓబళరాజును, పెద్ద-ఉద్దండ-కనగిరి-శబ్దపూర్వకౌబళులును గనుపట్టుచున్నారు; కాని, నామసామ్యముచేతను బితృనామముం బట్టియు నావళి చినౌబళుఁడే ప్రోలుగంటి రంగన్న ప్రభు వైనట్లు నిర్ధారింపవలసి యున్నది. చూడుఁడు!
ఈ గ్రంథమునందే ప్రథమాశ్వాసాంతపద్యములయందు:-
క. | హావళిచినయౌబళవసు, ధావల్లభమంత్రివర్య! ధైర్యాహార్యా! | |
అనియును దృతీయాశ్వాసాంతపద్యములయందు:-
ఉ. | హావళి చిన్నయోభళధరాధిపశేఖరసైన్యపాల! నానావిధ .... | |
అనియు విస్పష్టము చేయఁబడినది. ఈయావళి చినౌబళుని గుఱించి పింగళి సూరనార్యుఁడు కళాపూర్ణోదయకృత్యాదియం దిట్లు వ్రాసియున్నాఁడు.,
క. | ఆనారసింహవిభుఁ డస, మానగుణుఁడు రఘుపతిక్షమావరుఁడు యశ | |
క. | ఆమువ్వురలో నగ్రజుఁ, డైమించునృసింహునకుఁ దదంగనయగుశ్రీ | |
ఉ. | దేవవిభుండు భోగమునఁ దీవ్రమయాఖుఁ డఖండచండతే | |
ఈపద్యములకును నీనారసింహపురాణములోని పైయాశ్వాసాంతపద్యములకును నామవిషయమున విసంవాదలేశ మేనియు లేకుండుటచేఁ బ్రోలుగంటి రంగప్రధానికిఁ బ్రభు వైన యావళి చినయోబభూపాలుఁ డితఁడే యని తెల్ల మగుచున్నది. కళాపూర్ణోదయకృతిభర్త యగునంద్యాల కృష్ణరాజువలెనే యీయావళి చినయోబభూపాలుఁడును ఆరెవీటి బుక్కరాజున కాఱవతరమువాఁ డగుటచే మ రా. రా. కందుకూరి వీరేశలింగముపంతులుగారి లెక్కప్రకారము క్రీ. శ. 1473-వ సంవత్సరము మొదలుకొని క్రీ. శ. 1481-వ సంవత్సరమువఱకు రాజ్యము చేసిన బుక్కరాజునకుఁ దరువాత వచ్చిన యతనిసంతతి