28
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 15
లంబనన్యాయమున నించుమించుగాఁ గవికాలమును నిర్ణయించుటకుఁ దగిన యాధారములు చూపట్టుచున్నవి. ఎట్లనిన:- ఏతద్గ్రంథకృతిభర్త యగు ప్రోలుగంటి రంగప్రధాని నందెల చినయోబభూపాలుని దండనాథుఁ డైనట్టు లీగ్రంథమునఁ గృతిపతిప్రస్తావమున రాఘవమనీషిచే నీ క్రిందిపద్యములయందుఁ జెప్పఁబడి యున్నది.
సీ. | తనమండలాగ్ర ముద్దండారిమండల భూధరంబులకు దంభోళి గాగఁ | |
శా. | ఆరాజన్యశిఖావతంసచతురాశాం తావనీచక్రభృ | |
మఱియుఁ బ్రథమాశ్వాసము 14 వ పద్యమున:-
సీ. | - - - - - - - - - - - - | |
అనియు నున్నది. ఈ నందెల చినయోబనృపాలుఁ డారెవీటి బుక్కరాజు వంశములోని వాఁడైనట్లు పింగళి సూరనార్యుని కళాపూర్ణోదయకృతిపతి వంశావతారపద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. ఆరెవీటి బుక్కరాజునకు బెద్దభార్య యగునబ్బలదేవియందు సింగరయ్య, రామవిభుఁడు, అహోబలుఁడు నని ముగ్గురు పుత్రులు పుట్టిరి. వారిలోఁ బెద్దవాఁ డగుసింగరయ్యకు నరసింగరాజు, నారయ్య, తిమ్మయ్య, యని ముగ్గురుకొడుకులు. ఆ ముగ్గురలోను నరసింగరాజునకు సింగరయ్య, నారయ్య, కుమారౌబళుఁడు, వరదరాజు, రఘుపతి, యనునైదుగురు కుమారులు గలిగిరి. అందు సింగరయ్యకు నరసింహరాజు, రఘుపతి, ఓబరాజు, ననిముగ్గురు కొమాళ్లు. వారిలో నరసింహరాజు కొడుకు ఆవళిచినౌబళుఁడు. ఇతఁడే యీమననారసింహపురాణకృతిభర్త యగు ప్రోలుగంటి రంగన్న ప్రభువు. ఈతని పినతాతలు నలుగురలో నారయ్య కుమారుఁడు నరసింగయ్య. ఈ నరసింగయ్య కొడుకు కృష్ణమరాజు. ఈతఁడే కళాపూర్లో