పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము. ఆ 3

49


సీ.

కరతలామలకసంకాశంబు లయ్యె నీ కచలవిద్యారహస్యంబు లెల్ల
భావసంభవుఁడును నీవు నేమవుదురో కాని లావణ్య మనూనతరము
గోష్పదాక యయ్యె గులిశాయుధునివిభవంబు నీయైశ్వర్యవారిధికిని
ముక్తాతపత్త్రమై మూఁడులోకములకు నీకీర్తిచంద్రిక నీడ యొసఁగెఁ
జతురకవికల్పశాఖి నీవితరణంబు, నీమహత్త్వంబు వర్ణింప నేరఁ డజుఁడు
నకట నీ కేల పగవారి నాశ్రయించి, రాజ్య మొనరింప దీన గౌరవము గలదె.

21


సీ.

ముదివేల్పుఁ గదిసి నెమ్మొగములు నగులంగ జెంపవెట్టఁగలేమె సింహశౌర్య
కంసారి నిద్రించుకడలి [1]వండలివండు చేసి చల్లఁగలేమె వాసవారి
పిడికిళ్ల నుష్ణాంశుఁ బొడిపొడి గావించి మేఁ జల్లుకొనఁగ లేమే బలాఢ్య
యనలజిహ్వలు పల్లవావలిక్రియఁ దున్మి [2]తూఁటాడలేమె బంధురవిహార
నీయుపేక్షన యేమెల్ల నివుఱుఁమీఁదఁ, గవిసియుండిననిప్పులగతి విహీన
బాహుశౌర్యులమై యుండి ప్రతిఘటించి, పలికితిమి దేవ విసివి నీ పాద మాన.

22


సీ.

బలిమిదప్పక మూలబలములఁ బోషించి జలగిరిస్థలదుర్గచయ మమర్చి
వనదుర్గములు కొన్ని వశములు గావించి చతురంగబలముల సంతరించి
చారచక్షువులచే శత్రుభూపాలవైభవమంత్రతంత్రసంపదలు దెలిసి
సామదానాదికసమయంబు లరయుచు గుప్తకార్యజ్ఞానకుశలుఁ డగుచు
మించి సర్వాంగరక్ష గావించి నిశిత, నీతిదర్శనమున ధరణీవిభుండు
పరభుజాశౌర్యపాథోధిబాడబాగ్ని, వోలె నింకింపవలవదె భువనవంద్య.

23


ఉ.

శాతకరాసిచే నిమతసంహరణం బొనరింపఁజాలు నే
జాతిమనుష్యుఁ డైన బలసంభృతశౌర్యవివేకయుక్తుఁ డౌ
నాతఁడె సర్వలోకవిభుఁ డాతఁడె పర్వతపక్ష[3]శాసనుం
డాతఁడె చంద్రఖండధరుఁ డాతఁడె పంకజనాభుఁ డెంచఁగన్.

24


సీ.

ఆదినుండియును నీయఖిలంబు జంగమస్థావరరూపమై తనరుచుండు
నందు జంగమములై యండజస్వేదోద్భవజరాయుజంబులవరుస లెసఁగు
స్థావరంబులు మహీధరపాదపాదు లేతద్వయాన్యము లేదు తర్కశయ్య
నారెంటిలోన ముఖ్యములు జంగమములు వానిలో మనుజులు మానధన్యు
లానరులకన్న దేవత లధికతరులు, వేలుపులకన్న నసురులు వెగ్గలంబు
తత్కులంబునఁ బుట్టియుఁ దగునె యిట్లు, దానవాధీశతనయ యీతడమఁదనము.

25
  1. బండలివండు
  2. తూటడలేమె
  3. శాతనుండు