26
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 15
మ. | అమృతప్రాయవిశేషకావ్యరచనాహంభావవాగ్రామణీ | |
అనువరాహపురాణపద్యము పైవిషయమును దెలుపుచున్నది. మఱియు నితనిగ్రంథములయందలి యాశ్వాసాంతగద్యములం బట్టి యితఁడు భారద్వాజసగోత్రుండును రాఘవమనీషి పుత్రుఁడును, హనుమదుపాసకుఁడును, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదాంకితుఁడు నైయున్నట్లు తెలియవచ్చుచున్నది. ఆశ్వాసాంతగద్యములవలననే కాక వరాహపురాణము నందలి
గీ. | అష్టఘంటావధానవిశిష్టబిరుద, నీవు రచియింపదలఁచిన నిరుపమార్థ | |
అనుపద్యమును బట్టియు నీతనికీ (అష్టఘంటావధాన) బిరుద మున్నట్లు విశద మగుచున్నది. ఇది యెవ్వరిచే నీయఁబడినదో తెలియదు. ఇతఁడు తనచే రచియింపఁబడిన వరాహపురాణమున:-
సీ. | వరుణదిగ్వీథి నేపురమునఁ బ్రవహించెఁ బావనసలిలసంపన్న పెన్న | |
అని కంబముమెట్టును వర్ణించియుండుటచే నాకంబముమెట్టయే యీతని నివాసస్థల మయియుండునేమో యని తోఁచుచున్నది. మరియు మత్స్యపురాణమునందలి:-
శా. | భారద్వాజసగోత్రసంభవుఁడ నాపస్తంబుఁడన్ దిమ్మమాం | |
అను పద్యమువలన నీకవి యాపస్తంబసూత్రుఁడును, రామమనీషికిని దిమ్మాంబకును బుత్రుఁడును, వైష్ణవమతాసక్తుఁడు నైనట్లు తెలియవచ్చుచున్నది. ఇతఁడు మొదట వరాహపురాణమును రచియించి కంబముమెట్టు కరణమగు