పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 6

నారసింహపురాణము. ఆ 1

279


క.

మున్నాడి యసురవీరులు, పెన్నాటిక మైనసేన పిలపిల మనఁగా
నన్నారసింహుఁ గదిసిరి, కన్నారం జూచుఖచరగణములు వొగడన్.

176


చ.

అలఘుభుజాబలప్రథితు లాశరపుంగవు లుగ్రసాధనం
బుల నరకేసరిం బొదువఁ బూనినయంతనె తన్నృసింహుచూ
పులయెఱమంటలం జిమిడిపోయిరి జీర్ణములైరి జీవము
ల్దొలఁగిరి తూలి రోటఱిరి తొట్రిలి వ్రాలిరి కూలి రందఱున్.

177


ఉ.

ఆసమయంబునం బ్రమథు లార్చి రయంబొనగూర్చి పేర్చి బా
ణాసనసంప్రయుక్తనిశితాస్త్రములం బరఁగింప భూతసం
త్రాసకరంబులై నిగుడు తచ్ఛరము ల్నరసింహవక్త్రని
శ్వాసభవాగ్నిచే నడఁగి సర్వము భస్మము లయ్యెఁ జయ్యనన్.

178


వ.

ఇట్లు నరసింహదేవుండు.

179


క.

ప్రమధుల సంగరలీలా, విముఖులఁ గావించుటయును విఱిగి పఱచి తా
సమున శరభేశువెనుకకుఁ, గమియఁజనిరి నృహరి నిలిచెఁ గల్పాగ్నిరుచిన్.

180


గీ.

విఱిగి వచ్చినప్రమథుల వెఱపుదేరఁ, బలికి సంగరసన్నాహభయదలీల
నూలుకొనఁజేసి నంది యుల్లోలరోష, భీషణాకృతి ననిమొనఁ బెరిఁగి నిలిచి.

181


వ.

పక్షికులాధ్యక్షుండు వీక్షింప మనుజహర్యక్షంబు నాక్షేపించుచు నక్షీణ
క్ష్వేళాముఖరితహరిన్ముఖుం డై ఖరకరసహస్రసహశ్రోతయు భూతజాతభయా
నకప్రభాపటలచటులంబును ద్రిపురపురపురంధ్రీకపోలతలముకురనికరమ
కరిపత్రికాలతాలవిత్రంబును నిజప్రతాపదహనధవిత్రంబు నగునొక్కశక్తిం
బ్రయోగించిన శేషజిహ్వాంచలాకారంబై తోరం బై మెఱయుచు నప్పర
మసాధనంబు మాధవరూపాంతరంబు పై నిగిడిన నాబలుమగండు గండు
మెఱసి దండధరదండోదారం బగునాక్రూరంపుటలుగును నేలం బెట్టి
కాలం జమరి కదియుటయు మదనహరదౌవారికుండు వైరంబు పేరిన మనో
వికారంబున ఘోరాననుం డై నారాచాసారంబు గురియుచు నరమహా
వీరంబుఁ గదిసి బెట్టిదంబుగ నిట్టు లనియె.

182


సీ.

కనుఱెప్ప వేయక కనలిచూచిన నేమి సర్వతోముఖలీలఁ జనిన నేమి
ఘుర్ఘురధ్వనులతోఁ గొప్పరించిన నేమి బలునోరు దెఱచి గర్జిలిన నేమి
భువనసంపూర్తిగాఁ బొడవు సూపిన నేమి కొన్నెత్రు మైఁ బుల్ముకొన్న నేమి
యడవినుండక పోయి కడలి దాఁటిన నేమి మాయలముసలివై మనిన నేమి