పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 11


న్దట్టించెం[1]గపటారిమంత్రివరుల న్సత్కీర్తి లోకంబుల
న్రెట్టించె న్నరసయ్యరంగసచివశ్రేష్ఠుండు నిష్ఠారతిన్.

53


చ.

ధనములు గూడఁబెట్టి వసుధాస్థలిఁ గొందఱు కూళమంత్రు లా
ధనములు రాజబాధల వృథా పొరివోవఁగనిత్తు రజ్ఞులై
జననుతచర్యుఁ డైననరసప్రభురంగనమంత్రి దా యశో
ధనములు గూడఁబెట్టి ప్రమదంబున మించె ధరాతలంబునన్.

54


ఉ.

రంగనివాసనిర్మలధరంగని పంకజనాభపుత్రుదా
రంగని యభ్రవాహినితెరంగని సాంధ్రలసత్సుధాసుధా
రంగని సత్ప్రభాసురుచిరంబగు శ్వేతవరాహమూర్తికో
ఱంగని ప్రోలుగంటిపురిరంగనికీర్తి హసించు నిమ్మహిన్.

55


గీ.

ఎలమి నందెలచినయౌభళేంద్రదత్త, సలలితాందోళికాచ్ఛత్రచామరాది
చిహ్నములు దాల్చియెంతయుఁ జెన్ను మీఱి, మంత్రి రంగన వెలయు భూమండలమున.

56


సీ.

అమరమర్త్యభుజంగ మారాధ్యసౌరాష్ట్రసోమేశ్వరస్థానశోభితంబు
చెన్నకేశవదేవశేఖరప్రోత్తుంగభవనగోపురసౌధభాసురంబు
పాతకజీమూతపటలఝంఝానిల తుంగభద్రాతీరసంగతంబు
విహృతిలాలససౌరమహిళాంఘ్రిలాక్షాంక విలసితప్రాకారవేష్టితంబు
జవనసైంధవగంధేభసంకులంబు, చతురవారవిలాసినీసమధికంబు
బహులనిస్తులవస్తుసంపత్తివిజిత, గోపురం బొప్పుఁ బ్రోలుగంటీపురంబు.

57


క.

ఆపురి కేశవమూర్తికి, దీపితమణిభూష లొసఁగి దృఢతరరాజ్య
శ్రీపాలనఖేలనధా,రాపాలుఁడు నరసవిభునిరంగన వెలయున్.

58


సీ.

గురుతరవాధూలగోత్రాన్వయాంభోధిపూర్ణిమాచంద్రుఁడై సొలుపు మీఱె
జైనచార్వాకాదిసకలదుర్మతఘోరగహనధూమాంకుఁడై కణఁకమించె
శిష్యకదంబకచిరతరసంపత్తివితరణఖ్యాతిమై వృద్ధిఁబొందె
శ్రీవేంకటాచలశిఖరమందిరదేవతాపరమూర్తియై యవతరించె
జగతిఁ గందాళభావనాచార్యవర్య, తనయుఁ డయ్యె గురుస్వామిఘనత కెక్కె
నట్టి శ్రీరంగగురునాథుఁ డాత్మగురుఁడు, గాఁగ సన్నుతివడసె రంగప్రభుండు.

59


షష్ఠ్యంతములు

క.

ఏతాదృగ్గుణసుధికిని, ఖ్యాతాశ్రితసకలసుకవికలశాంబుధికిన్
వీతాభిమానశాత్రవ, జాతాభయదాననిపుణశయసేవధికిన్.

60
  1. న్ధట్టించ్చెన్ - మూ.