పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 11


క.

ఆమునిమణికులజలనిధి, సోమునికైవడి జనించె సురుచిరవిభవో
ద్దాముఁడు సమధికసమర, స్థేముఁడు నౌ ప్రోలుగంటి తిప్పన ధాత్రిన్.

21


శా.

ఆమంత్రీంద్రుఁడు ప్రౌఢరాయనృపదండాధీశసంపత్కళా
సామగ్రి న్విలసిల్లి మల్లి సుమ భాస్వత్కీర్తివిస్ఫూర్తి ను
ద్దామాసాధ్యమహోమహత్త్వమున సంధాయుక్తి దోశ్శక్తి వా
చామాధుర్యమునం బురావిభులతో, జర్చించు నర్చస్వియై.

22


క.

అరుదంద లోకమాతని, బిరుదందియఁ గీలుకొన్నభీకరశత్రూ
త్కరములకు ననుదినంబును, సొరిది న్సమకూరు భోగసుకృతఫలంబుల్.

23


సీ.

కదలనిభక్తితోఁ గట్టించెఁ బంపావిరూపాక్షదేవునిగోపురంబు
విఠ్ఠలపతికిఁ గావించి యర్పణచేసె మహనీయతరభోగమంటపంబు
మాల్యవంతము రఘుక్ష్మావధూభర్తకు ఘనకిరీటం బుపాయన మొసంగె
దరిసెనంబిచ్చె[1] మతంగవీరన్నకు[2]2 గట్టాణిముత్యాలకంఠమాల
బ్రాహణుల నిల్పె నగ్రహారములయందు, దిక్కు లన్నింటఁ గీర్తులు పిక్కటిల్ల
వెలసె దుర్మంత్రిసంఘాతవిభవజాత, తిమిరకుముదారి యగుచు నాతిప్పశౌరి.

24


చ.

అతనికి భామినీతిలక మై నుతికెక్కినభైరవాంబకు
న్సుతు లుదయించి రిద్దఱు యశోరమణీయచతుర్దిగంతరు
ల్వితరణచాతురీజితరవిప్రభవామరధామధేనువు
ల్కుతలకనత్పురందరులు కొండనమంత్రియు నాగశౌరియున్.

25


వ.

తదగ్రజుండు.

26


ఉ.

నిండినవేడ్కఁ దేగవహి నిల్పినబంగరుకొండ నాఁగ భూ
మండలి నెల్లవారు బహుమార్గముల న్వినుతింప నశ్వవే
తండవినూత్నరత్నసముదంచితకాంచనముఖ్యవస్తువుల్
కొండని తిప్పయప్రభుని కొండన యర్థుల కిచ్చు నిచ్చలున్.

27


గీ.

వాడు నిర్మలనిజవంశవర్ధనుండు, వాఁడు బాంధవసముదాయవత్సలుండు
వాఁడు దేవేంద్రసన్నిభవైభవుండు, వానిఁ బోలఁ బ్రధాను లివ్వసుధఁ గలరె.

28


సీ.

ఘోరాహవక్షోణి గుంది ధైర్యము దూలి కురురాజు మడుఁగులోఁ జొరకయున్న
జీవనస్థితి చౌకగా వానరములచే వడిసముద్రుఁడు గట్టువడకయున్నఁ
బోరిలో నడుఁకుచుఁ బూని ధర్మతనూజుఁ డాచార్యుతోఁ గల్లలాడకున్నఁ
బురహరనేత్రవిస్ఫురదనలాహుతిఁ గంతుఁ డనంగుండు గాకయున్న

  1. దర్శనంబిచ్చె -మూ.
  2. వీరణ్నకు -మూ.